ఈ ఏడాది సంక్రాంతి మొదటిలో విడుదలైన చిత్రాలలో వాల్తేరు వీరయ్య సినిమానీ ఇండస్ట్రీ తో పాటు అభిమానులు కూడా సక్సెస్ అయిందని విషయాన్ని గట్టిగా చెబుతున్నారు. వీర సింహారెడ్డి సినిమాకి పోటీగా విడుదలైన ఈ చిత్రం మంచి సక్సెస్ను అందుకుంది. ఇక తనదైన కామెడీ టైమింగ్ తో వాల్తేరు వీరయ్య సినిమా అందరిని అలరించిందని చెప్పవచ్చు. గతంలో ఆయన చేసిన గ్యాంగ్ లీడర్ ,ముఠామేస్త్రి ,ఘరానా మొగుడు తదితర చిత్రాలతో సమానంగా ఈ సినిమా క్లాస్ తో పాటు మాస్ ఆడియన్స్ను కూడా బాగా ఆకట్టుకుంది.
ఇక చిరంజీవి మరొకసారి తన కామెడీ టైమింగ్ బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులను సైతం కొల్లగొట్టారు. ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అయిన ఈ సినిమా ప్లస్ గా మారింది.ఇక ఈ సినిమాకి చిరంజీవితో పాటు రవితేజ కూడా మంచి ఎనర్జీటీ ఇవ్వడంతో ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచిందని చెప్పవచ్చు. చిరంజీవి మరియు రవితేజ పాత్రను పక్కనపెడితే ఈ సినిమాలో ఐదుగురికి మాత్రం తీవ్ర నిరాశని మిగిల్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో నటించిన శృతిహాసన్ కు ఏ మాత్రం పేర్లు దక్కలేదు.
ఇక అలాగే రా ఏజెంట్గా ప్రేక్షకులను కూడా మెప్పించలేదని సమాచారం. మరొక నటుడు ప్రకాష్ రాజశేఖర్ ఏమాత్రం పేరును దక్కించుకోలేకపోయారు. ఇక సై సినిమాలో విలన్ గా నటించిన ప్రదీప్ రావత్ సైతం ఈ సినిమాలో కేవలం జూనియర్ ఆర్టిస్టుగా చూపించాలని చెప్పవచ్చు. రవితేజకు జోడిగా నటించిన హీరోయిన్ కేథరిన్ కి కూడా కేవలం ఒక డైలాగ్ మినహా ఏమి ఇవ్వలేదని తెలుస్తోంది. ఇక ఊర్వశి రౌతేలా ఎలా సైతం ఐటెం సాంగ్లో నటించిన పెద్దగా ప్రయోజనం లేదని చెప్పవచ్చు.