చైతు విష‌యంలో స‌మంత కూడా చేయలేని పని బాలయ్య‌ చేశాడు!

యువ సామ్రాట్‌ అక్కినేని నాగచైతన్య వివాదాలకు, వివాస్ప‌ద‌ వ్యాఖ్యలకు చాలా దూరంగా ఉంటాడు. సోషల్ మీడియాలో కూడా ఒకరిని ఉద్దేశించి నెగటివ్ కామెంట్స్ చేయడం అనేది ఎప్పుడూ జ‌ర‌గ‌లేదు. కేవలం సినిమాలను ప్ర‌మోట్ చేయడం కోసమే చైతు సోషల్ మీడియాను వినియోగిస్తాడు. సమంతతో విడాకుల విషయంలో చైతు అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు.

సమంత పరోక్షంగా చైతూని ఉద్దేశిస్తూ అనేక పోస్టులు పెట్టింది. కొన్ని ఇంటర్వ్యూలో నేరుగానే నెగటివ్ కామెంట్స్‌ చేసింది. అయినా సరే చైతు స్పందించలేదు. హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో డేటింగ్ చేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అప్పుడు కూడా చైతు నోరు విప్పలేదు. అయితే తాజాగా నందమూరి బాలకృష్ణ `వీర సింహారెడ్డి` సక్సెస్ మీట్ లో అక్కినేని తొక్కినేని అంటూ కామెంట్లు చేయడం వివాస్ప‌దం అయింది. అయితే ఈ విషయంపై నాగచైతన్య స్పందించ‌డం గ‌మ‌నార్హం.

`ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్ తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డలు, అలాంటి వారిని అవమానించడం అంటే మనల్ని మనం కించపరుచుకోవడ‌మే` అంటూ బాల‌య్య‌కు ప‌రోక్షంగా గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చాడు. మొత్తానికి ఎన్నడూ సోషల్ మీడియాలో విమర్శలు, అసహనంతో కూడిన పోస్ట్ లు పెట్టిని చైతు తాతకు అవమానం జరిగిందని బాల‌య్య‌కు చాలా హుందాగా చుర‌క‌లు వేస్తూ పోస్ట్ పెట్టాడు. దీంతో కొందరు నెటిజ‌న్లు చైతూలో చైతన్యం తెచ్చిన ఘనత బాలయ్యకే దక్కిందని కామెంట్లు చేస్తున్నారు. సమంత కూడా చేయలేని పని బాల‌య్య చేశాడ‌ని అంటున్నారు.