నందమూరి బాలకృష్ణ అఖండ లాంటి సూపర్ హిట్ తర్వాత నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ సినిమా వీర సింహారెడ్డి. ఈ సినిమాను మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకులు ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణకు జంటగా అందాల భామ శృతిహాసన్ నటిస్తుంది. మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ సినిమాగా వీర సింహారెడ్డి మరో 15 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
బాలయ్య అభిమానులు ఎప్పుడు సంక్రాంతి పండుగ వస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే బాలయ్య కూడా ఈ సినిమా ప్రమోషన్స్ కోసం రెడీ అయిపోయాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్ అభిమానులలో భారీ స్థాయిలో హైప్స్ ను పెంచేసాయి. తాజాగా నిన్న ఈ సినిమా నుంచి వచ్చిన మేకింగ్ వీడియో కూడా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. బాలకృష్ణ కూడా జనవరి ఫస్ట్ వీక్ నుంచి వరుస ఇంటర్వ్యూలో పాల్గొనబోతున్నారని తెలుస్తుంది.
ఇప్పుడు ఈ సినిమాకు మ్యూజిక్ అందించిన థమన్ కూడా వీరసింహారెడ్డి ప్రమోషన్స్ కోసం రెడీ అయిపోయాడు. తాజాగా థమన్ ఈ సినిమాపై సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. థమన్ తన పోస్ట్ లో ‘కలుద్దాం దుమ్ము లేపుదాం.. జై బాలయ్య.. ఇక జనవరి 12 థియేటర్స్ దద్దరిల్లి పోవాల్సిందే.. ప్రతి ఒక్కరూ ప్రిపేర్ అవ్వండి’.. అంటూ తన సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ లో అదిరిపోయే కామెంట్ ఇచ్చాడు.
ఇక థమన్ కూడా ఈ సినిమాకు అఖండను మించిన అదిరిపోయే బిజిఎం ఇచ్చినట్టు తెలుస్తుంది.. థమన్ ఇచ్చిన బిజిఎంతో థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయమంటూ హింట్ ఇచ్చేశాడు.. ప్రస్తుతం థమన్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో బాలయ్య అభిమానులకు న్యూ ఇయర్ రోజున సంక్రాంతి పండుగ వచ్చినంత ఆనందాన్ని ఇచ్చింది.