కేజిఎఫ్ మూవీతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న కన్నడ సోయగం శ్రీనిధి శెట్టి.. ఇటీవల `కోబ్రా` మూవీ తో ప్రేక్షకులను పలకరించింది. విక్రమ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అయితే తాజాగా ఈ బ్యూటీ తెలుగులో ఓ ప్రాజెక్టుకు సైన్ చేసిందని అంటున్నారు.
నారప్ప, దృశ్యం 2, ఎఫ్ 3 చిత్రాలతో వరుస విజయాలను అందుకున్న విక్టరీ వెంకటేష్ తన తాతపరి చిత్రాన్ని హిట్, హిట్-2 చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న శైలేష్ కొలను దర్శకత్వంలో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శైలేష్ కొలను ఆల్రెడీ వెంకటేశ్కి కథ వినిపించడం, అది ఆయనకు నచ్చడంతో సినిమాకి ఓకే చెప్పడం జరిగిపోయాయని టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. స్టెలిష్ యాక్షన్ థ్రిల్లర్గా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారని సమాచారం. వెంకటేష్ నటించనున్న 75వ చిత్రమిది.
త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై అఫీషియల్ అనౌన్స్ రాబోతోంది. ఇకపోతే తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీనిధి శెట్టిని ఎంపిక చేశారని తెలుస్తోంది. ఆమెతో సంప్రదింపులు సైతం పూర్తి అయ్యాయని అంటున్నారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. వెంకీ, శ్రీనిధి శెట్టి మధ్య ఏజ్ గ్యాప్ చాలా ఉంది. వెంకీ వయసు 62 కాగా.. శ్రీనిది శెట్టికి 30. అంటే వీరిద్దరి మధ్య ముప్పై ఏళ్లకు పైగా వయసు వ్యత్యాసం ఉంది. ఈ విషయం తెలిసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. అయితే సరైన ఆఫర్లు లేకపోవడం వల్లే శ్రీనిధి సీనియర్ హీరో అని కూడా చూడకుండా మూవీకి ఓకే చెప్పిందని అంటున్నారు.