తెలుగు సినీ ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ తలరాత ఎప్పుడు మారుతుందో ఎవరమో చెప్పలేము. ఇక సినిమాలు విడుదలైన తర్వాత రాత్రికి రాత్రే డిజాస్టర్ లను దక్కించుకున్న వారు చాలామందే ఉన్నారు. అదే స్థాయిలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన వారు కూడా చాలామందే ఉన్నారు. అయితే సడన్ గా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకొని మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో హీరోయిన్ శృతిహాసన్ కూడా ఒకరు. గతంలో కూడా ఈమె ఫ్లాపులను ఎదుర్కొన్నది. 2017 తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన శృతిహాసన్ మళ్లీ మూడేళ్ల విరామం తర్వాత క్రాక్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది.
ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడంతో కం బ్యాక్ సినిమా మంచి సక్సెస్ ని ఇచ్చింది.దీంతో వరుసగా సీనియర్ హీరోలతో సినిమాలలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇక రీసెంట్గా అగ్ర కథానాయకులుగా పేరుపొందిన చిరంజీవి బాలయ్యతో కలిసి సినిమాలలో నటించి సంక్రాంతికి రెండు సినిమాలు విడుదలై బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లను బాగానే రాపడుతున్నాయి. ఇక కెరియర్ లో ఏ హీరోయిన్ కు దక్కని అరుదైన సక్సెస్ ఒకేసారి దక్కించుకున్న హీరోయిన్గా పేరు సంపాదించింది.
తెలుగులో హైయెస్ట్ గ్రాస్ తగ్గించుకున్న వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలలో ఈమె హీరోయిన్గా నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఇదే ఫామ్ ని కొనసాగిస్తూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది శృతిహాసన్. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా చిత్రంలో ఇమే హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశలో ఉన్నట్లు సమాచారం ఈ సినిమా సెప్టెంబర్ 28వ తేదీన విడుదల కాబోతోంది. శృతిహాసన్ హ్యాట్రిక్ ను సొంతం చేసుకోవడం ఖాయం అంటూ పలువురు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.