ఆసక్తికరమైన పోస్ట్ షేర్ చేసిన సమంత..?

టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న సమంత ప్రస్తుతం మయోసైటీస్ అనే వ్యాధితో సతమతమవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయినా సరే సమంత పట్టువదలని విక్రమార్కుడిలా తన సినిమాలలో నటిస్తూనే తానే సొంతంగా డబ్బింగ్ చెబుతూ ఉంటోంది. నిత్యం కూడా ఎప్పుడు ఏదో ఒక వార్తలలో నిలుస్తూ ఉంటుంది సమంత. వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే బిజీ బిజీగా మారిపోయింది సోషల్ మీడియాలో కూడా తరచూ ఆక్టివ్ గానే ఉంటుంది.

Samantha Ruth Prabhu shares post about letting go and acceptance, two  months after split with Naga Chaitanya - Hindustan Times

ప్రస్తుతం సినిమాలని సమంత పూర్తిచేసే పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక సమంత నటించిన శాకుంతలం సినిమా కోసం ప్రస్తుతం పని చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా తాజాగా డబ్బింగ్ పనులకు కూడా సమంత మొదలుపెట్టినట్లుగా ఒక ఫోటోని షేర్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని తమ అభిమానులతో పంచుకుంటూ సమంత ఒక ఆసక్తికరమైన కొటేషన్ ని షేర్ చేసుకుంది. డబ్బింగ్ స్టూడియోలో తీసిన ఒక ఫోటోని సమంత పోస్ట్ చేస్తూ.. ఎన్ని బాధలు వచ్చినా..ఎంత నష్టపోయిన..ఈ ప్రపంచం మనమల్ని వదిలేసిన తోడుగా ఉండేది కళ ఒక్కటే కళ మాత్రామే అన్ని సమస్యలకు పరిష్కారమని కొటేషన్ను రాసుకొచ్చింది.

ప్రస్తుతం సమంత షేర్ చేసిన ఈ పోస్ట్ చాలా వైరల్ గా మారుతోంది. అయితే సమంత ఈ పోస్ట్ కేవలం తన సమస్యలను ప్రస్తావిస్తూ రాసుకు వచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈ ఏడాది ఫిబ్రవరి 17న విడుదల కాబోతున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రం మహాభారతంలో ఉండే ఆదిపర్వంలోని శకుంతల, దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా చిత్రీకరించినట్లు సమాచారం. మరి ఈ సినిమాతో సమంత కం బ్యాక్ ఇస్తుందేమో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)