సమంత గత కొంత కాలం నుంచి మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి కారణంగా ఇంటికే పరిమితం అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యే గుడ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. గత ఏడాది యశోద సినిమాతో ప్రేక్షకులను పలకరించి బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకునే సమంత.. ఇప్పుడు `శాకుంతలం`తో అలరించేందుకు సిద్ధమవుతోంది.
దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్పై నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు. సమంత, దేవ్ మోహన్ ఇందులో జంటగా నటించారు. మణిశర్మ స్వరాలు అందించారు. గత ఏడాదే ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ, పలు కారణాల వల్ల విడుదలను మేకర్స్ వాయిదా వేశారు.
అయితే తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను చిత్ర టీమ్ అధికారికంగా వెల్లడించింది. ఎపిక్ లవ్ స్టోరీగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ప్రేమికుల రోజుని, మహాశివరాత్రిని పురస్కరించుకుని ఫిబ్రవరి 17న పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు తాజాగా మేకర్స్ ఓ రొమాంటిక్ పోస్టర్ ను కూడా బయటకు వదిలారు. మరి ఈ సినిమా సమంతకు ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.