‘బాబాయ్ హోటల్’ ప్రారంభించిన నితిన్.. హైదరాబాద్‌లో సందడే సందడి..!

ఈ గజిబిజి పరుగుల ప్రపంచంలో బయటికి వెళ్లే వారిలో చాలామంది హోటల్ ఫుడ్స్ పైన ఆధారపడుతున్నారు. అయితే ఎంత మంచి ధర పెట్టినా రుచికరమైన ఫుడ్ అందించే హోటల్స్‌ ఎక్కువగా లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. కానీ కొన్ని హోటళ్లు సరసమైన ధరలకే టేస్టీ ఫుడ్ అందిస్తూ బాగా పాపులర్ అవుతున్నాయి. ఈ రకం హోటల్స్‌ సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ పాపులర్ అవుతున్నాయో తప్ప మూతపడడం లేదు. అలాంటి హోటల్స్ లో బాబాయ్ హోటల్ ఒకటి. 80 సంవత్సరాలుగా విజయవాడలో రన్‌ అవుతూ ఎందరో ప్రజలకు కమ్మటి భోజనాలను అందిస్తూ వస్తోంది. ఈ హోటల్ తాజాగా హైదరాబాద్‌ వాసులకు కూడా అందుబాటులోకి వచ్చింది.

దీనిని టాలీవుడ్ స్టార్ హీరో నితిన్ ప్రారంభించారు. హనుమంతుడి/ ఆంజనేయ మాలలో కనిపించిన నితిన్ ఈ హోటల్ ఓపెనింగ్ సెరిమోనీకు వచ్చారు. ఆ బాబాయ్ హోటల్ బ్రాంచ్‌ను యజమానులు నితిన్ చేతుల మీదగా ఓపెన్ చేయించారు. ఈ హైదరాబాద్ బ్రాంచ్‌ను మణికొండలో నిర్మించారు. డైరెక్టర్ శశికాంత్ తన ఫ్రెండ్స్ తో కలిసి ఫ్రెండ్స్ ఫ్యాక్టరీని ప్రారంభించిన సంగతి తెలిసిందే అయితే. ఫ్రెండ్స్ ఫ్యాక్టరీ పేరు మీదేనే ఈ బాబాయ్ హోటల్‌ను కూడా స్థాపించారు.

బాబాయ్ హోటల్‌ని మణికొండకి తీసుకురావడం హ్యాపీగా ఉందని, రుచికరమైన వంటకాలను చాలా హైజినీక్గా తయారు చేస్తామని హోటల్ నిర్వాహకులు తెలిపారు. ఒకసారి తమ హోటల్ కి వస్తే మళ్ళీ మళ్ళీ వచ్చేంతలా కస్టమర్లు అలవాటు పడతారన్న నమ్మకం తమలో ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్టార్ ప్రొడ్యూసర్ సుధాకర్ రెడ్డి, డైరెక్టర్ వెంకీ కుడుముల, రామ జోగయ్య శాస్త్రి, రచయిత దర్శకుడు వక్కంతం వంశీ, నిర్మాత ఠాగూర్ మధు తదితరులు వచ్చారు. నితిన్ హైదరాబాద్‌కి రావడం వల్ల అక్కడ అభిమానుల సందడి నెలకొంది.