`ఖుషి` పై న‌యా అప్డేట్‌.. విజ‌య్ దేవ‌ర‌కొండ అనుకున్న‌ది సాధించాడు!

టాలీవుడ్ రౌడీ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స్టార్ బ్యూటీ స‌మంత కాంబినేష‌న్ లో `ఖుషి` అనే రొమాంటిక్ ఎంట‌ర్టైన‌ర్ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే 40 శాతం షూటింగ్ కూడా కంప్లీట్ అయింది.

అంతలో సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధికి గురి కావడంతో ఖుషి షూటింగ్ కు బ్రేక్‌ పడింది. ప్రస్తుతం మయోసైటిస్ నుంచి సమంత కాస్త కోలుకుంది. ఇటీవ‌ల శాకుంత‌లం ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్ లోనూ పాల్గొంది. కానీ, ఖుషి షూటింగ్ లో పాల్గొనేందుకు స‌మంత ఇంకొంత టైమ్ కొరింద‌ని.. అయితే విజ‌య్ మాత్రం షూటింగ్ త్వ‌ర‌గా రీస్టార్ట్ చేయ‌కుండా త‌న త‌దుప‌రి చిత్రాన్ని ప‌ట్టాలెక్కిస్తాన‌ని చెప్పిన‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది.

దాంతో స‌మంత‌ను షూటింగ్ కు ఒప్పించే ప‌నిలో ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ప‌డ్డార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే విజ‌య్ అనుకున్న‌ది సాధించాడు. ఖుషీ షూటింగ్ రీస్టార్ కాబోతోంది. తాజాగా ఈ మూవీపై డైరెక్ట‌ర్ విశ నిర్మాణ న‌యా అప్డేట్ ఇచ్చాడు. అతి త్వ‌ర‌లోనే ఖుషి రెగ్యుల‌ర్ షూటింగ్‌ను ప్రారంభించ‌బోతున్న‌ట్లు ట్వీట్ చేశాడు. సినిమాకి సంబంధించి అన్ని ప‌నులు సజావుగానే జరుగుతున్నాయని ఆయ‌న తెలిపారు. ఈయ‌న ట్వీట్ తో స‌మంత త్వ‌ర‌లోనే షూటింగ్ లో పాల్గొన‌బోతోంద‌ని స్ప‌స్ట‌మైంది.