ఫ్యాన్స్ తో కృతి శెట్టి సీక్రెట్ మీటింగ్‌.. ఇండ‌స్ట్రీలోనే తొలిసారి ఇలా!

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్‌ డబ్ల్యూ మూవీ `ఉప్పెన` సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కృతి శెట్టి.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆ తర్వాత కృతి శెట్టి నటించిన బంగార్రాజు, శ్యామ్ సింగ‌రాయ్ చిత్రాలు సైతం మంచి విజయం సాధించాయి.

దీంతో కృతి శెట్టికి తిరుగు లేదని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా ఈ భామకు మూడు ఫ్లాపులు పడ్డాయి. ప్రస్తుతం సరైన హిట్ కోసం ఈ భామ ఎదురుచూస్తోంది. ఇదిలా అంటే తాజాగా కృతి శెట్టి సీక్రెట్ గా ఫ్యాన్స్‌ తో మీటింగ్ పెట్టేసింది. నెట్టింట్లో కృతి శెట్టికి ఫ్యాన్ పేజీలు ఎక్కువే. అయితే తాజాగా కృతి హైదరాబాద్ లో సైలెంట్ గా ఎక్కువ ప్రమోషన్ లేకుండా ఫ్యాన్స్ మీట్ పెట్టింది.

సోషల్ మీడియాలో తన ఫ్యాన్ పేజీలు నడిపే వాళ్లందరితో కలిసి కృతి ఈ మీట్ నిర్వహించింది. కాసేపు ఫ్యాన్స్ తో ముచ్చ‌టింది.. వారితో ఫోటోల‌కు పోజులిచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అయితే హీరోలు తప్ప ఇలా ఫ్యాన్ మీట్ ను హీరోయిన్లు నిర్వహించింది లేదు. ఇండ‌స్ట్రీలోనే తొలిసారి ఒక హీరోయిన్‌ ఫ్యాన్ మీట్ నిర్వహించడం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.