SSMB -28 చిత్రంలో హీరోయిన్ల సెట్టయ్యారు గా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటించాలని ఎంతోమంది హీరోయిన్స్ సైతం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక మహేష్ బాబు 28వ సినిమాని డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి అందరికీ తెలిసింది. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఇప్పటికే పూర్తి అయినట్లుగా వార్తలు వినిపించాయి. అయితే ఆ తర్వాత షెడ్యూల్ ని మహేష్ బాబు కుటుంబంలో చోటుచేసుకున్న పలు విషాదాల వల్ల ఈ సినిమా షూటింగ్ కాస్త ఆలస్యంగా అయ్యింది. ఇక ఇదే సమయంలో పూజా హెగ్డే ప్రమాదానికి గురై కాలికి దెబ్బ తగలడంతో ఈ షూటింగ్ మరొకసారి వాయిదా పడినట్లు వార్తలు వినిపించాయి.

ఇదంతా ఇలా ఉండగా సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాకి సంబంధించి తాజా అప్డేట్ కూడా విడుదల చేశారు ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించబోతున్నట్లు పోస్టర్ తో క్లారిటీ ఇచ్చారు అలాగే ఈ సినిమా ఓటీటి రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ ఇప్పటికే కొనుగోలు చేసినట్లు తెలియజేసింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో నాగు వంశీ మాట్లాడుతూ ఈ సినిమాలో పూజా హెగ్డే శ్రీ లీల హీరోయిన్స్ గా నటిస్తున్నట్లు క్లారిటీ ఇవ్వడం జరిగింది.

Mounilka DHFM (@MounilkaDHFM) / Twitter

అయితే వీరిలో ఫస్ట్ ఎవరు సెకండ్ అని ఆప్షన్ ఏమీ లేదని కథ ప్రకారం ఇద్దరు హీరోయిన్స్ ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి వీరిద్దరిని ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు వీరిద్దరి పాత్రలు సినిమాలో చాలా కీలకంగానే ఉంటాయంటూ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ సినిమా షూటింగ్ ఈనెల 18 నుంచి ప్రారంభమవుతుందని నాగ వంశీ తెలియజేశారు ఆగస్టు 11వ తేదీన ఈ సినిమా విడుదలవుతుందని తెలియజేశారు. మరి ఎట్టకేలకు ఈ సినిమా గురించి హీరోయిన్ల విషయంపై అప్డేట్ ఇవ్వడంతో పలు రూమర్లకు చెక్ పడ్డాయని చెప్పవచ్చు.