అలనాటి తార, దివంగత నటి శ్రీదేవి ముద్దుల కుమార్తె జాన్వీ కపూర్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. బాలీవుడ్ లో సినీ కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ చేసింది తక్కువ సినిమాలే అయినా దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ సంపాదించుకుంది.
అందుకు కారణం సోషల్ మీడియానే. సినిమాల కంటే గ్లామర్ షో ద్వారానే జాన్వీ ఎక్కువ పాపులర్ అయింది. తరచూ హాట్ హాట్ ఫొటో షూట్లతో నెట్టింట దుమారం రేపుతుంటుంది.
తాజాగా లెహంగా చోళీ లో అందంగా ముస్తాబైన జాన్వీ కపూర్.. చిట్టి నడుము చూపిస్తూ కొంటెగా ఫోటోలకు పోజులు ఇచ్చింది. ప్రస్తుతం నెటిజన్ల కళ్ళు తిప్పుకోకుండా చేస్తున్న జాన్వీ తాజా ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
క్రీమ్ కలర్ డ్రెస్ లో జాన్వీ అందాలకు కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు. ఆమె చేపకళ్ల చూపులకు ఫిదా అయిపోతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం జాన్వీ తాజా ఫోటోలపై మీరు ఓ లుక్కేసేయండి.