ఒకవైపు టీవీ షోలో మరొకవైపు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది అనసూయ. స్టార్ యాంకర్ గా తన అంద చందాలతో చలాకి తనంతో బుల్లితెర పైన వెండితెర పైన ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో వరుసగా షాపింగ్ మాల్స్ కూడా ప్రారంభోత్సవానికి వెళుతూ తెగ వైరల్ గా మారుతొంది. ఇలా కెరియర్ పరంగా చాలా బిజీగా ఉన్న అనసూయ సోషల్ మీడియాలో మాత్రం తరచు యాక్టివ్గానే ఉంటుంది. నిత్యం తన గ్లామర స్ ఫోటోలతో పాటు తనకు సంబంధించిన విషయాలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది.
అయితే తాజాగా అనసూయ ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియోను షేర్ చేయడం జరిగింది. అందులో నేను డిజాస్టర్ తో బాధపడుతున్నాను..నా గురించి నెగటివ్గా మాట్లాడే వారిని అసలు లెక్కచేయనని ..వారి గురించి పట్టించుకోకపోవడమే నా రుగ్మత అంటూ అసలు విషయాన్ని తెలియజేసింది అనసూయ. దీంతో పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టుతో వ్యాఖ్యలతో ఈమె పైన ట్రోలింగ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోను తన గురించి ఎవరు తప్పుగా మాట్లాడిన ట్రోల్ చేసిన వారిని లెక్క చేయాలంటూ తనకు తోచిందే చేస్తానంటూ పరోక్షంగా అనసూయ కౌంటర్ వేసినట్లు తెలుస్తోంది.
మొదట రంగమ్మత్త పాత్రలో అలరించిన అనసూయ ఆ తర్వాత ఎన్నో చిత్రాలను వైవిధ్యమైన పాత్రలలో నటించింది.ప్రస్తుతం పుష్ప-2, రంగమార్తాండ తదితర చిత్రాలలో నటిస్తోంది.అలాగే వెబ్ సిరీస్ లో కూడా అనసూయ నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అనసూయ షేర్ చేసిన ఆ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది. మరి రాబోయే రోజుల్లో జబర్దస్త్ లో రియంట్రీ ఇవ్వాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.
View this post on Instagram