ఆ విషయంలో చిరుకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన స్టార్ హీరోయిన్…??

చిరంజీవి టైటిల్ రోల్‌లో, రవితేజ, శ్రుతి హాసన్, కేథరిన్ మెయిన్ లీడ్స్‌లో నటించిన వాల్తేరు వీరయ్య వారి 13 సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కాబోతోంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రీరిలీజ్ ఈవెంట్ రోజు మరి కొద్ది నిమిషాల్లో విశాఖపట్నంలో గ్రాండ్‌గా జరగనుంది. ఇప్పటికే చిరంజీవి ఒక ట్వీట్ చేస్తూ.. “హలో, ఈరోజు సాయంత్రం వైజాగ్‌లోని AU ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్‌లో సాయంత్రం 6 గంటలకు వాల్తేరు వీరయ్య ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం కలుద్దాం.” అని అభిమానులకు పిలుపునిచ్చారు. ఈ ఈవెంట్‌కి సంబంధించిన ఏర్పాట్లు ఆల్రెడీ ఫినిష్ అయిపోయాయి.

ఈ సినిమాలో యాక్ట్ చేసిన చిరంజీవి, రవితేజ ఇప్పటికే విశాఖపట్నం చేరుకున్నారు. ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ కూడా ఈవెంట్ జరుగుతున్న ప్లేస్ కి విచ్చేశారు. ఇక దర్శకనిర్మాతలు కూడా స్పెషల్ ఫ్లైట్‌లో విశాఖపట్నంకు రీచ్ అయ్యారు. కానీ అసలు రావాల్సిన మెయిన్ పర్సన్ మాత్రం రాలేదు. అది ఎవరో కాదు ఈ మూవీ హీరోయిన్ శ్రుతి హాసన్. సాధారణంగా సినిమా హీరోయిన్ వస్తేనే ఈవెంట్ కి కల వస్తుంది. సినిమా ప్రమోషన్లు కూడా బాగా జరుగుతాయి. చిరంజీవి కూడా అందుకోసమే చాలా రోజులుగా శ్రమిస్తున్నాడు. కానీ హీరోయిన్ శ్రుతి మాత్రం ఈవెంట్‌కి రావడంలేదని తాజాగా తెలిసింది.

ఈ విషయాన్ని ఆమెనే సోషల్ మీడియాలో వెల్లడించింది. తాను ఈ ఈవెంట్‌కి రాకపోవడానికి ఆరోగ్య సమస్యలే కారణమని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా వెల్లడించింది. మరో స్టోరీలో కారణాన్ని వివరిస్తూ… ‘అనారోగ్యంతో బాధపడుతున్నా. అందువల్ల వాల్తేరు వీరయ్య మూవీ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హాజరు కాలేకపోతున్నా. అందుకు చాలా బాధపడుతున్నా. ఈ సినిమాలో చిరంజీవితో కలిసి వర్క్ చేయడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. ఈ రోజు ఈవెంట్‌ను విజయవంతం చేయండి” అని శ్రుతిహాసన్ చెప్పుకొచ్చింది. అయితే ఈ ముద్దుగుమ్మ ఇలా ఈవెంట్ కి కావడం లేదని చెప్పడంతో చాలామంది పెద్ద విరుస్తున్నారు.