హీరోతో గొడవ పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ తేజ..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ తేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతోమంది హీరోలను, హీరోయిన్లను తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. చిత్రం సినిమాతో డైరెక్టర్ గా మారిన తేజ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాతో తాను డైరెక్టర్గా పరిచయమయ్యిందే కాకుండా హీరో, హీరోయిన్స్, కమెడియన్స్ తో పాటు ఇంకా చాలామంది టెక్నీషియన్స్ ని కూడా తెలుగు తెరకు పరిచయం చేశారు. ఈ సినిమాతో ఉదయ్ కిరణ్ హీరోగా గుర్తింపు సంపాదించారు.

అలాగే ఈ సినిమా అయిపోయిన వెంటనే జయం సినిమాతో నితిన్, సదా లాంటివాళ్లను కూడా తెలుగు తెరకు పరిచయం చేశారు. ఈ చిత్రం కూడా మంచి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత మహేష్ తో కలిసి నిజం సినిమాని చేశారు.మళ్ళీ నితిన్ తో హీరోగా మరొక సినిమాని తెరకెక్కించారు.ఆచిత్రమే ధైర్యం. అయితే ఈ సినిమా షూటింగ్ చేశాక డైరెక్టర్ తేజ కొన్ని సన్నివేశాలు బాగా రాలేదని మనం అనుకున్న స్టోరీ కరెక్ట్ గా లేదు మళ్లీ షూట్ చేద్దామని నిర్మాత ఆయన నితిన్ తండ్రికి చెప్పారట. అయితే ఈ సినిమా కోసం అప్పటికే చాలా ఖర్చు చేసినట్లుగా సమాచారం.

థియేట‌ర్లో సినిమా చూడ‌డానికి వెళ్తే అతడినే పెట్టి ఇండస్ట్రీ హిట్ సినిమా  తీసాడు | director teja introduced nithin in jayam movie as anonymous hero , director  teja, hero nithin, anonymous ...

ఇక దీంతో పెట్టుబడి పెట్టడం మా వల్ల కాదు సినిమా ఎలా ఉన్నా సరే రిలీజ్ చేద్దాం ఆడితే ఆడుతుంది లేకపోతే ఫ్లాప్ అవుతుందని చెప్పాడట. దీంతో డైరెక్టర్ తేజ కి కోపం వచ్చి ఆ సినిమా ప్రివ్యూ చూడడానికి వచ్చిన డిస్ట్రిబ్యూటర్స్ కి ఈ సినిమా బాగా రాలేదు ప్లాప్ అవుతుందని చెప్పడంతో దీంతో సినిమా తీసిన డైరెక్టర్..ఇలా చెబుతున్నాడు అంటే ఇక సినిమా కొనుక్కోవడం వేస్ట్ అని డిస్ట్రిబ్యూటర్లు అందరూ వెనక్కి వెళ్లిపోయారట. దీంతో నితిన్ డైరెక్టర్ తేజని నిలదీసి అడగగా.. అప్పుడే వీరిద్దరి మధ్య గొడవ మొదలైనట్లు తెలుస్తోంది.