హనీరోజ్.. ఈ మలయాళ కుట్టి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఇటీవల ఈ బ్యూటీ `వీర సింహారెడ్డి` సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీలో శృతి హాసన్ మెయిర్ హీరోయిన్ అయినప్పటికీ.. హనీరోజ్ పాత్ర బాగా హైలైట్ అయింది.
బాలయ్యకు మరదలుగా మరియు తల్లిగా హనీరోజ్ అదరగొట్టేసింది. అలాగే వీరసింహారెడ్డి ఈవెంట్స్ లోనూ హనీరోజే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. అయితే తాజాగా బాలయ్య ఈ భామకు మరో బంపర్ ఆఫర్ ఇచ్చారట. వీర సింహారెడ్డి అనంతరం బాలయ్య అనిల్ రావుపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. `ఎన్బీకే 108` వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని ఇటీవల పట్టాలెక్కించారు.
తండ్రి కూతురు మధ్య ఈ మూవీ కథ సాగుతుంది. ఇందులో బాలయ్య కూతురుగా శ్రీలీల ఎంపికైంది. అయితే బాలయ్యకు జోడిగా హనీరోజ్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని అనిల్ రావిపూడి భావించారట. అందుకు బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. వెంటనే ఆమెను ఫైనల్ చేసేశారని ఇన్సైడ్ టాక్ నడుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సిందే.