ఈ హీరోల వల్ల అభిమానులు ఆనందంగా లేరా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలు విడుదలవుతున్నాయి అంటే చాలు అభిమానులు ఫుల్ ఖుషి చేస్తూ ఉంటారు. సినిమాల రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ రావాలన్న బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టించాలన్న కేవలం స్టార్ హీరోల అభిమానుల వల్లే సాధ్యమవుతుంది. అయితే గడిచిన కొద్ది సంవత్సరాల క్రితం నుంచి అభిమానుల టెస్ట్ పూర్తిగా మారిపోయిందని చెప్పవచ్చు. కొంతమంది స్టార్ హీరోల చేస్తున్న పనికి అభిమానులు చాలా ఫీలవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి వాటి గురించి తెలుసుకుందాం.

NTR Jr, Allu Arjun, Mahesh Babu: Cool looks in jackets | IWMBuzzపూర్తి వివరాల్లోకి వెళితే అల్లు అర్జున్, మహేష్ బాబు, ఎన్టీఆర్ అభిమానుల ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ ముగ్గురు హీరోలు అనుసరిస్తున్న విధానమే అభిమానులను తెగ ఫీల్ అయ్యేలా చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ పుష్ప సినిమానీ స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా పెను సంచలన విజయాన్ని అందుకుంది.దీంతో ఈ సినిమా సీక్వెల్ పుష్ప -2 నీ కూడా తెరకెక్కిస్తూ ఉన్నారు. అయితే ఎన్నో రోజుల తరువాత షూటింగ్ మొదలుపెట్టి.. మళ్లీ బ్రేక్ ఇచ్చారు. దీంతో మళ్లీ సినిమా షూటింగ్ గురించి పెద్దగా పట్టించుకోకుండా తమ ఫ్యామిలీతో కలిసి బాగా ఎంజాయ్ చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు అల్లు అర్జున్.

ఇక మరొక హీరో మహేష్ బాబు అభిమానులు కూడా ఈ విషయంలో చాలా ఫీలవుతున్నారు. సర్కారు వారి పాట సినిమా తర్వాత మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో SSMB -28 చిత్రాన్ని ప్రకటించారు. ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మహేష్ కూడా ఎక్కువగా ఫ్యామిలీతో వెకేషన్కు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ప్రాజెక్టు విషయంలో పెద్దగా ఆసక్తి చూపించడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక మరొక నటుడు జూనియర్ ఎన్టీఆర్. కొరటాల శివ తో తన 30వ సినిమాని చేయబోతున్న సంగతి తెలిసిందే ఈ ప్రాజెక్టు ప్రకటించి ఏడాది కావస్తున్న ఇప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. అయితే ఎక్కువగా తన కుటుంబంతో వెకేషన్ కి వెళ్తూ ఉన్నారు ఎన్టీఆర్. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల కాబోతున్నట్లు ప్రకటించడం జరిగింది.