తెలుగు సినీ ఇండస్ట్రీలో వచ్చిన అందమైన ప్రేమకథా చిత్రాలలో కొత్త బంగారులోకం సినిమా కూడా ఒకటి. డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.. వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ హీరో , హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా కుర్రకారులను సైతం బాగా ఆకట్టుకుందని చెప్పవచ్చు. ముఖ్యంగా టీనేజ్ లవ్ స్టోరీ గా వచ్చిన ఈ సినిమా లోని పాటలు డైలాగ్స్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. సంగీతాన్ని మిక్కీ జేయయర్ అందించారు.
ఈ సినిమాలో ముందుగా వరుణ్ సందేశ్ హీరోగా అనుకోలేదట. అయితే కొత్త బంగారులోకం సినిమాలో మొదటగా అనుకున్న హీరో ఎవరంటే అక్కినేని నాగచైతన్య ఆన్నట్లుగా తెలుస్తోంది. ఈ యంగ్ హీరోని హీరోగా ఎంపిక చేశారట. ఇదే విషయాన్ని దర్శక నిర్మాతలు నాగార్జున ముందు ఉంచితే చైతన్య ను మాస్ యాక్షన్ తో ఎంట్రీ ఇవ్వాలని తెలియజేశారట. మాస్ స్టోరీ ఉంటే నీ బ్యానర్ లోనే సినిమా చేద్దామని దిల్ రాజు కు చెప్పారట నాగార్జున. ఆ తరువాత ఈరోజు ఎవరిని తీసుకుందామని ఆలోచిస్తున్న సమయంలోనే శేఖర్ కమ్ముల తీసిన హ్యాపీడేస్ సినిమాలో వరుణ్ సందేశ్ చూసి ఇతనైతే బాగుంటుందని దిల్ రాజు భావించడంతో హీరోగా తీసుకున్నారట.
ఈ సినిమా మంచి విజయం సాధించడంతో వరుణ్ సందేశ్ కు పలు సినిమా అవకాశాలు వెలుపడ్డాయి. కానీ నాగచైతన్య హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన జోష్ సినిమా మాత్రం భారీగా ప్లాప్ అయ్యింది. దీంతో ఒక బ్లాక్ బస్టర్ చిత్రాన్ని నాగచైతన్య చే చేతులారా వదులుకున్నారని చెప్పవచ్చు.