ఇండియన్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సతీమణి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన అనుష్క శర్మ తాజాగా కోర్టు మెట్లుక్కింది. పన్ను రికవరీ కోసం సేల్స్ టాక్స్ డిపార్ట్మెంట్ వారు రీసెంట్గా అనుష్కకు నోటీసులు అందజేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ పన్ను ఎగవేత కేసులో అనుష్క ముంబై హైకోర్టును ఆశ్రయించింది.
ఇక తనకు వచ్చిన సేల్స్ టాక్స్ పిటిషన్ తిరస్కరించాలని కోరుతూ ఆమె కోట్లు స్వయంగా పిటిషన్న్ దాఖలు చేసింది. అయితే గతంలో కూడా ఒకసారి అనుష్క మీద హైకోర్టు సీరియస్ అయిన విషయం తెలిసిందే. టాక్స్ డిపార్ట్మెంట్ ద్వారా పిటిషన్ దాఖలు చేయడం తాము ఇంతవరకు ఎప్పుడూ చూడలేదని, డైరెక్ట్ గా పిటీషన్ ఎందుకు వేయలేదు అంటూ అనుష్క లాయర్ పై గతంలో హైకోర్టు మండిపడింది.
ఇప్పుడు దీంతో ఈసారి అనుష్కనే స్వయంగా తన పిటీషన్ కోర్టులో దాఖలు చేసింది. సినిమాలను నిర్మిస్తున్న నిర్మాతలకు విధిస్తున్న స్లాబుల్లో తమకు ఎటువంటి సంబంధం ఉండదు, చిత్ర పరిశ్రమంలో ఒకనటిగా.. పలు ఈవెంట్లో అవార్డు ఫంక్షన్స్లో కనిపిస్తాము. దానికే మీరు నిర్మాతలకు విధిస్తున్న స్లాబుల్లో తాను కూడా పన్ను చెల్లించాలని అడగటం భావ్యం గా అనిపించడం లేదని ఆమె పిటీషన్ లోపేర్కొంది. ఇక అంతే కాకుండా వీటితోపాటు.. ఒక నిర్మాతలకు వేసే పన్నులు కాకుండా తనకు కూడా నటి నటులకు వేసే పన్నులు విధించమని ఆమె కోరింది. ఎప్పుడు అనుష్క పిటిషన్ పై కోర్ట్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.