భూమా ఫ్యామిలీలో ట్విస్ట్..నంద్యాల ఆయనకేనా?

గత కొన్ని రోజుల నుంచి నంద్యాల, ఆళ్లగడ్డ సీట్ల విషయంలో టీడీపీలో క్లారిటీ లేని విషయం తెలిసిందే. ఈ సీట్లు ఎవరికి దక్కుతాయనే అంశంపై పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. అయితే ఈ సీట్ల కోసం భూమా ఫ్యామిలీలో పోరు నడుస్తోంది. భూమా అఖిలప్రియ ఈ సారి రెండు సీట్లని తమకే దక్కేలా చేసుకోవాలని చూస్తున్నారు. అంటే ఆళ్లగడ్డలో అఖిల..నంద్యాలలో అఖిల సొంత సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డికి దక్కేలా చేసుకోవాలని చూస్తున్నారు.

కానీ నంద్యాలలో భూమా బ్రహ్మానందరెడ్డి ఉన్నారు. అక్కడ టీడీపీలో పనిచేస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయనే పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఈయన్ని సైడ్ చేసి తన సొంత తమ్ముడుకు సీటు దక్కించుకుకునేలా చేయాలనేది అఖిల ప్లాన్. కానీ ట్విస్ట్ ఏంటంటే అసలు అఖిల సీటుకే ఎసరు వచ్చేలా ఉంది. ఆళ్లగడ్డ సీటుని అఖిలకు కాకుండా..భూమా కిషోర్ రెడ్డికి ఇస్తారనే ప్రచారం వస్తుంది. అయితే ఈ సీటు విషయంలో క్లారిటీ లేదు.

అయితే తాజాగా బ్రహ్మానందరెడ్డి తాజాగా చంద్రబాబుతో భేటీ అయ్యారు. నియోజకవర్గంలో ఉన్న పరిస్తితులని బాబుకు వివరించారు. అలాగే బాబు కూడా నంద్యాలలో పార్టీని ఇంకా బలోపేతం చేయాలని సూచించారు. ఇక సీటు మార్పు విషయంపై బాబు ఏ విధమైన సంకేతాలు ఇవ్వలేదు. దాదాపు నంద్యాల సీటు మాత్రం బ్రహ్మానందరెడ్డికే దక్కేలా ఉంది.