తాప్సీ.. టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ ఆ తర్వాత బాలీవుడ్ కు మకాం మార్చి అక్కడ మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా ముద్ర వేయించుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. తాజాగా ఈ బ్యాటీకి బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న `డంకీ` చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని అందుకుంది.
రాజ్కుమార్ హీరానీ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్మీదకు వెళ్లనుంది. ఈ విషయాన్ని తాప్సీ స్వయంగా వెల్లడించింది. అంతేకాదు ఈ సందర్భంగా పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తన కెరీర్లోనే అత్యుత్తమ అవకాశం ఇదని తాప్సీ తెగ మురిసిపోయింది.
`షారుఖ్ ఖాన్ చిత్రంలో గెస్ట్ గా నటించినా చాలనుకునేదాన్ని. అలాంటిది ఏకంగా హీరోయిన్గా నటించే అవకాశం రావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. రాజ్కుమార్ హీరానీ చిత్రాలు వినోదం, సందేశంతో ఉంటాయి. ఇండస్ట్రీలోని ఇద్దరు ఉత్తమ ప్రతిభావంతులతో కలిసి నటించడం ఆనందంగా ఉంది. ఓ నటికి ఇంతకుమించి ఏం కావాలి?` అంటూ తాప్సీ చెప్పుకొచ్చింది. దీంతో ఈమె కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్ గా మారాయి.