సల్మాన్‌ను కలిసిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఫ్యామిలీ.. ఎందుకంటే..

టాలీవుడ్‌లో కొరియోగ్రాఫర్‌గా మంచి పేరు తెచ్చుకున్న జానీ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ భాషల్లోని స్టార్ హీరోలతో సూపర్ హిట్ సాంగ్స్‌కి స్టెప్పులు వేయించి ప్రేక్షకులను అలరించాడు. ఈ స్టార్ కొరియోగ్రాఫర్ ఇప్పటివరకు తెలుగు టాప్ హీరోస్ అయిన ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ తదితరులకు ఎన్నో సోలిడ్ మూమెంట్స్ కంపోజ్‌ చేసాడు. ఇక ఇప్పుడు బాలీవుడ్ హీరోలకు కూడా జానీ తన స్టెప్స్ పరిచయం చేయడానికి సిద్ధమయ్యాడు. ఇప్పుడు బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్‌తో ఒక సినిమాలో జానీ స్టెప్పులు వేయించబోతున్నాడు.

ఫర్హాద్ సామ్జ్ దర్శకత్వం వహిస్తున్న ‘కిసి కా భాయ్ కిసి కి జాన్’ అనే సినిమా లో సల్మాన్ ఖాన్ హీరో గా నటిస్తున్నారు. ఈ సినిమా లో పూజ హెగ్డే హీరోయిన్ గా విక్టరీ వెంకటేష్, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకి జానీ మాస్టర్ కొరియగ్రాఫర్ కావడంతో ఆయన ఫ్యామిలీతో కలిసి సల్మాన్ ఖాన్‌ని కలిశాడు. సల్మాన్, జానీ ఫ్యామిలీతో ప్రేమగా మాట్లాడి ఫొటోలు తీసుకున్నారు. ఈ అవకాశం ఇచ్చినందుకు సల్మాన్ భాయ్‌కి థాంక్స్ అని చెప్తూ ఆయనతో దిగిన ఫొటోలని షేర్ చేశాడు జానీ. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

జానీ తన కెరీర్ ఆరంభంలో ఒక డాన్స్ షోలో అవమానానికి గురి అయ్యి ఆ షో నుంచి వెళ్లిపోయాడు. అలా ఎంతో అవమానానికి గురైన ఈ జానీ మాస్టర్ ఇప్పుడు ఇండియన్ బిగ్ స్టార్ మూవీస్‌కి కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. మొన్నటిదాకా టాలీవుడ్‌కే పరిమితమైన ఈ డ్యాన్సర్ ఇప్పుడు బాలీవుడ్ బడా హీరోలకు కూడా కొరియోగ్రఫీ అందించే స్థాయికి ఎదిగాడు. అలా అతడి ప్రయాణం ఇప్పుడు అందరికీ స్ఫూర్తిదాయకంగా మారింది.