రష్మిక మందన్న ఫోటో షూట్స్ ఘాటెక్కిస్తున్నాయా? ఫిలింనగర్లో గుసగుసలు ఇవే?

టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్న గురించి కుర్రాళ్లకు ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పనిలేదు. మొదటి సినిమా ఛలో సినిమాతోనే తెలుగు నిర్మాతలను తనవైపు తిప్పుకుంది అమ్మడు. ఆ సినిమాలో ఈ అమ్మడుని చూసిన నిర్మాతలు ఆమె అందానికి ఫిదా అయిపోయి డేట్స్ కావాలని క్యూలు కట్టారు. దాంతో ఆమె ఓవర్ నైట్ స్టార్ డం సంపాదించుకుంది. ఈ క్రమంలో విజయ్ దేవరకొండతో చేసిన సినిమా ‘గీత గోవిందం’ సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో అమ్మడుకి ఇక తెలుగులో తిరిగి లేకుండా పోయింది. దాంతో ప్రస్తుతం ఇక్కడ అగ్ర హీరోయిన్ల సరసన చేరింది.

ఇక అక్కడినుండి చిన్న స్టార్లను మొదలుకొని పెద్ద పెద్ద స్టార్లతో సైతం వరుసగా నటిస్తూ పోయింది. ఆ సినిమాలు కూడా హిట్ అవ్వడంతో రష్మిక నిర్మాతలపాలిట గోల్డెన్ లెగ్ అయింది. దాంతో ఇపుడు దాదాపు సినిమాలన్నీ ఈ ముద్దుగుమ్మే చేస్తోంది. ఆ విషయం పక్కనబెడితే క్షణం తీరికలేకుండా సినిమాలు చేస్తున్నా మరోవైపు సోషల్ మీడియాలో పిచ్చెక్కిస్తోంది. రోజుకో ఫోటో షూట్ అంటూ అభిమాన కుర్రాళ్లను కవ్విస్తోంది.

ఇదే విషయం తెలుగు ఫిలింనగర్లో ప్రస్తుతం వాడివేడిగా సాగుతోంది. విషయం ఏమంటే అవకాశాలు మెండుగా వస్తున్నా ఈ ఫోటో షూట్ల రచ్చ ఏంటంటూ ఓ వర్గం వారు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఈ విషయంపై సోషల్ మీడియాలో రష్మిక అభిమానులు స్పందిస్తూ ఆమెకి లేని కష్టం మీకేమిటి అంటూ సో కాల్డ్ విమర్శకులను ప్రశ్నిస్తున్నారు. ఇక తాజాగా రష్మిక మందన్నా అభిమానులకు వీకెండ్‌ ట్రీట్‌ ఇచ్చింది. లేత ఆకుపచ్చ కలర్‌ కోట్‌ ధరించి పిచ్చెక్కించింది. కవ్వించే చూపులతో ప్రేక్షకులను మత్తెక్కిస్తుంది. నయా ఫోటో షూట్‌తో ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చిందని చెప్పొచ్చు.