మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో తను 28వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికి ఓ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఈనెల 8వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మళ్లీ మొదలు కానుంది. ఇది ఇలా ఉంటే ఇప్పుడు మహేష్ అభిమానులు టాలీవుడ్ స్టార్ దర్శకుడు వంశీ పైడిపల్లి పై ఫైర్ అవుతున్నారు. వంశీ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో వారిసు ( తెలుగులో వారసుడు) సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి ప్రేక్షకులకు ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించిన చిత్ర యూనిట్. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ సినిమా నుండి రెండు పాటలను విడుదల చేశారు. ఆ పాటలే ఇప్పుడు మహేష్ అభిమానులకు ఆగ్రహం తప్పించాయి. దీనికి కారణం 2019లో మహేష్ 25వ సినిమా మహర్షిని వంశీ పైడిపల్లి తెరకెక్కించారు. ఈ సినిమా మంచి విజయం సాధించి జాతీయ అవార్డును కూడా గెలుచుకుంది.
అయితే ఇది మహేష్ కెరియర్ లో ల్యాండ్ మార్క్ సినిమా అవటంతో టైటిల్ ఎంతో స్పెషల్ గా ఉంటుందని అభిమానులు భావించారు. కానీ దర్శకుడు మాత్రం టైటిల్ ఎంతో సింపుల్గా రివిల్ చేసి అభిమానులకు నిరాశ కలిగించారు. ఇక ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తన సినీ కెరియర్ను మొదలుపెట్టి 30 సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా వారిసు సినిమా నుంచి సెకండ్ సాంగ్ అయిన ది దళపతి అనే టైటిల్ తో కోలీవుడ్ హీరో శింబుతో పాడించి విడుదల చేశారు.
ఈ సాంగ్ కూడా విజయ్ అభిమానులను ఎంతగానో అలరిస్తూ భారీ వ్యూస్తో దూసుకుపోతుంది. ఈ పాటతో విజయ్ అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇప్పుడు ఇదే మహేష్ అభిమానులను అసంతృప్తికి గురిచేస్తుందట. వంశీ పైడిపల్లి విజయ్కు ఇచ్చిన ప్రాముఖ్యత మహేష్ కిి ఇవ్వలేదని వంశీ పైడిపల్లి పై మహేష్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఇప్పుడు మహేష్ అభిమానుల విమర్శలను వంశీ ఏ విధంగా తిప్పి కొడతారో చూడాలి.