మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీరయ్య సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. మాస్ మహారాజ రవితేజ కీలకపాత్రను పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది.
ప్రస్తుతం చిత్ర యూనిట్ శ్రుతి హాసన్, చిరంజీవి పై ఫ్రాన్స్ లో ఓ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. తాజాగా ఆ సాంగ్ షూట్ కంప్లీట్ అయింది. ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా వెల్లడించాడు. సౌత్ ఆఫ్ ఫ్రాన్స్ లో స్విజర్లాండ్-ఇటలీ బోర్డర్ లో ఉన్న ఆల్ప్స్ మౌంటెన్ లోయలో ఈ సాంగ్ ను జనవరి 12న చిత్రీకరించారట. మైనస్ 8 డిగ్రీల చలిలో చాలా కష్టపి ఈ సాంగ్ ను షూట్ చేశారట.
అయితే అక్కడ పకృతి అందాలను కళ్లకు కట్టినట్టు చూపించారు చిరు. ఆల్ప్స్ మౌంటెన్ లోయలో లొకేషన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయని, ఆ అందాలు చూసి తాను కూడా చాలా ఎగ్జైట్ అయ్యానని చిరు అన్నారు. అంతేకాదు, చిరు స్వయంగా అక్కడి లొకేషన్స్ లో కొన్ని వీడియోలను షూట్ చేసి ఇన్స్టా ద్వారా పంచుకున్నారు. ట్విస్ట్ ఏంటంటే.. ఈ వీడియో చివర్లో వల్తేరు వీరయ్య సాంగ్ ను కూడా చిరు లీక్ చేశారు. `నువ్ శ్రీదేవి అయితే.. నేనే చిరంజీవి అంటా.. రాయే రాయే చేసేద్దాం లవ్వూ` అంటూ సాగే ఈ సాంగ్ మాస్ ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చేలా ఉందని చెప్పాలి.
https://www.instagram.com/reel/CmJdL8XJIaP/?utm_source=ig_web_copy_link