త్వరలో బాలయ్య షోకి ప్రభాస్‌, గోపిచంద్‌… TRPలు కొండెక్కడం గ్యారంటీ!

టాలీవుడ్లో బాలయ్య క్రేజ్ చాలా ప్రత్యేకమైనది అని చెప్పుకోవాలి. ఇక ఇటీవల బుల్లితెరలో కూడా బాలయ్య షోస్ అదరగొట్టడంతో మరింత ప్రజాదరణ పొందాడు బాలకృష్ణ. అందులో భాగంగా స్టార్ సెలబ్రిటీస్ సందడి చేయడంతో.. ఆహాలో అన్‌స్టాపబుల్‌ షో దూసుకుపోతోంది. ఇక త్వరలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను ఈ షోకు తీసురాబోతున్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి. ఫస్ట్ సీజన్ ను సక్సెస్ పుల్ గా కంప్లీట్ చేసుకుని.. ఇప్పుడు సెకండ్ సీజన్ ను గ్రాండ్ గా లాంచ్ చేసారు ఆహా టీమ్. ఈసారి సినిమావాళ్లతో పాటు.. పొలిటికల్ లీడర్స్ కూడా ఈ షోలో సందడి చేసి దుమ్ముదులిపారు.

డబుల్ ధమాకా సందడితో దూసుకుపోతున్న అన్‌స్టాపబుల్‌ సీజన్‌-2లో బాక్ బస్టర్ ఎపిసోడ్ కు ప్లానింగ్ జరుగుతుందని విశ్వసనీయ వర్గాల ద్వారా లీక్ అయింది. బాలయ్య ఫుణ్యమా అని ఎప్పుడూ.. ఏ టాక్ షోలకు రాని సెలబ్రిటీలు ఈ షోలో సందడి చేయడం విశేషం. ఆయన హోస్ట్ అవ్వడంతో అందరిలోనూ ఓ పాజిటీవిటి ఏర్పడింది. ఈక్రమంలోనే తాజాగా ఈ టాక్‌ షోకు స్టార్‌ హీరోలు ప్రభాస్‌, గోపిచంద్‌ గెస్ట్‌లుగా రాబోతున్నట్లు లీక్ అయింది. దాంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ విషయం తెలిసిన రెబల్ స్టార్ ఫాన్స్, గోపీచంద్ ఫాన్స్ సంబరాలలో మునిగిపోయారు. వీళ్ల ఎపిసోడ్‌ను డిసెంబర్‌ 11న షూట్‌ చేయనున్నట్లు కూడా టాక్‌ బయటకు పొక్కింది. అలాగే ఈ ఎపిసోడ్‌ను న్యూయర్‌ సందర్భంగా రిలీజ్‌ చేయాలని ఆహా సంస్థ ప్లాన్‌ రచిస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇకపోతే ప్రభాస్‌-గోపిచంద్‌ ఇద్దరు మంచి స్నేహితులన్న విషయం అందరికీ విదితమే. వీరిద్దరు కలిసి వర్షం సినిమాలో ఫస్ట్ టైమ్ నటించారు.