టాలీవుడ్ లో ఈయేడాది వరుసగా విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. గడిచిన కొద్ది రోజుల క్రితం సూపర్ స్టార్ కృష్ణ, ఆయన భార్య, నటుడు కృష్ణంరాజు మరణ వార్త మరువకముందే ఈ రోజున కైకాల సత్యనారాయణ మరణించడం జరిగింది. ఎన్నో సినిమాలలో విభిన్నమైన పాత్రలలో నటించి దిగ్గజ ధీరుడుగా పేరుపొందారు కైకాల సత్యనారాయణ. ఈయన మరణ వార్త విన్న సినీ ప్రముఖులు ఈయన అభిమానులు సైతం ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
కైకాల సత్యనారాయణ గారు 60 సంవత్సరాలుగా తెలుగు సినీ రంగంలో ఎన్నో పారాణిక ,సాంఘిక, చారిత్రక, జానపద చిత్రాలలో కూడా నటించి నట సౌర్వభౌముడిగా బిరుదు పొందారు. తాజాగా బాలకృష్ణ కైకాల గారి మరణ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురై కొన్ని విషయాలను తెలియజేశారు. బాలకృష్ణ మాట్లాడుతూ మా కుటుంబంతో కైకాల సత్యనారాయణ గారికి చాలా స్నేహబంధం ఉన్నది.నాన్నగారితో కలిసి ఎన్నో చిత్రాలలో నటించారు.అలాగే ఎన్నో చిత్రాలకు పని చేశారని నా చిత్రాల్లో కూడా మంచి మంచి పాత్రలో నటించారు.. నటుడుగా మంచి స్థానాన్ని సంపాదించుకున్నారని తెలియజేశారు బాలయ్య.
సినీ జీవితంలో ప్రజా జీవితంలో కూడా ఎంతో బాధ్యతగా ఆయన అందరిని బాగా అలరించారు. ఆయన సేవలు మరువలేనివి ఈరోజు ఆయన మన మధ్య లేకపోవడం చాలా దురదృష్టకరం అంటూ బాలయ్య ఎమోషనల్ అవుతూ తెలియజేశారు ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ బాలయ్య తెలియజేయడం జరుగుతుంది. కైకాల సత్యనారాయణ ఎంతోమంది నటీనటులతో కలిసి పనిచేశారు. ఇక ఎంతోమంది శని సెలబ్రిటీలు సైతం ఈయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.