ఈ ఏడాది ఎంతోమంది అభిమానులను సంపాదించిన కొంతమంది నటి నటులు సైతం మరణించడం జరిగింది. అయితే ఇది కేవలం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ , శాండిల్ వుడ్, మలయాళం ఇతర భాషలలో కూడా పలు సినీ ప్రముఖులు సైతం మరణించారు. కొంతమంది నిర్మాతలు ,ఫ్యాషన్ డిజైనర్లు, లేదా సినీ పరిశ్రమకు చెందిన వారి కుటుంబ సభ్యులు ఇలా మరణించారు. అయితే గడిచిన కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ సినిమాలను నిర్మించిన జీవి జి రాజు భార్య పద్మజ మరణించింది.
ఈమె ప్రముఖ నటుడు హరనాథ్ కూతురు అన్న సంగతి తెలిసిందే.. మరొకపక్క సీనియర్ స్టార్ నటుడు కైకాల సత్యనారాయణ కూడా మరణించారు. ఈ విషాదం నుండి సిరి పరిశ్రమ కోలుకోకముందే ఇప్పుడు తాజాగా మరొక నటి ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈమె వయసు 20 సంవత్సరాలు కావడం అందర్నీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. అసలు వివరాల్లోకి వెళితే ప్రముఖ యువ నటి తునీషా శర్మ ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈమె బుల్లితెర పైన కాకుండా వెండితెర పైన కూడా బిజీ నదిగా కొనసాగుతూ వచ్చింది.
ముంబైలో షూటింగ్లో పాల్గొంటున్న సమయంలో ఈమె తన రూమ్ లోకి వెళ్లి ఉరి వేసుకున్నట్లు తెలుస్తోంది.ఆ తర్వాత చిత్ర బృందం హాస్పిటల్ కు తీసుకువెళ్లే మార్గమధ్యంలోనే మరణించినట్లుగా సమాచారం. చక్రవర్తి అశోక్ సామ్రాట్, మహారాణా ప్రతాప్, ఆలీబాబా వంటి తదితర సీరియల్స్ లో నటించింది. అలాగే దబాంగ్ 3, కహాని -2 వంటి సినిమాలలో కూడా నటించింది. అయితే ఈయన మృతికి గల కారణాలు ఏంటి అనే విషయం ఇంకా తెలియడం లేదు. ఈ విషయం తెలిసిన అభిమానులు శోకసముద్రంలోకి మునిగిపోయారు. పలువురు సినీ ప్రముఖుల సైతం ఈ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.