లొకేషన్ లో కోపం తెప్పించిన కాస్ట్యూమ్ వర్కర్.. సహనం కోల్పోయిన బాలయ్య ఏం చేశారంటే..?

టాలీవుడ్ నటి సింహం నందమూరి బాలకృష్ణ మెంటాలిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మంచి పని చేస్తే భుజం తట్టే ఆ చేతులే ..చెడ్డ పని చేస్తే చంపచోళ్ళు అనిపిస్తాయి. అంతటి ధైర్యం గల మనిషి . ఎదుటివాడు ఎంత పెద్ద వాడైనా సరే తప్పు చేస్తే మొఖానే అడిగి నిలదీసే మనస్తత్వం కలవాడు బాలయ్య . తనకు నచ్చిన పని ఎక్కడ జరుగుతున్నా సరే సెకండ్స్ లోనే కోపం వచ్చేస్తుంది. ఆ కోపం కంట్రోల్ కాకపోతే ఎదుటివాడు బలి అవ్వాల్సిందే .

కాగా రీసెంట్గా బాలయ్య కోపానికి గురైయ్యాడు “వీరసింహారెడ్డి” సినిమాకు వర్క్ చేస్తున్న కాస్ట్యూమ్ వర్కర్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మనకు తెలిసిందే ఈ మధ్యకాలంలోనే ఈ సినిమా షూటింగ్ టర్కీలో జరిగింది . అఖండ సినిమా తర్వాత బాలకృష్ణ గోపీచంద్ మల్లినేని డైరెక్షన్లో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు. ఆ సినిమానే ఈ వీరసింహారెడ్డి . ఈ మధ్యనే టైటిల్ ప్రకటించిన టీం ..రీసెంట్గా సినిమా నుండి ఫస్ట్ సింగిల్ సైతం విడుదల చేసింది . పాట కూడా బాలయ్యకు తగ్గట్టుగానే అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో నందమూరి ఫ్యాన్స్ కి బాగా ఎక్కేసింది ఈ పాట.

దీంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అంత ధీమా వ్యక్తం చేస్తున్నారు . కాగా ఇలాంటి టైం లో సినిమాలో షూటింగ్ లోకేషన్ లో జరిగిన గొడవ గురించి నెట్టింట లీక్ అయ్యి రచ్చ రచ్చ చేస్తుంది. టర్కీలో షూటింగ్ జరుగుతున్న టైం లో బాలయ్యకు కాస్ట్యూమ్ వర్కర్ కోపం తెప్పించాడట. ఆయన సహనం కోల్పోయే విధంగా ప్రవర్తించి బాలయ్య కోపానికి గురైనట్లుగా తెలుస్తుంది. ఆ టైంలో సినిమా దర్శకుడు , నిర్మాత అక్కడ లేకపోవడంతో బాలయ్య ఇంకా కోపానికి గురైయ్యాడట .

మనకు తెలిసిందే బాలయ్య మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు . పైగా అదే టైంలో రెస్పాన్సిబులిటీగా వ్యవహరించాల్సిన నిర్మాత , దర్శకుడు అక్కడ లేకపోవడంతో బాలయ్య కోపం కట్టలు తెంచుకుందట . దీంతో ఫైర్ అయిపోయి చెడామడా తిట్టేసాడట . అంతేకాదు ఆయన మాటలకు హర్ట్ అయిన కాస్ట్యూమ్ వర్కర్ ఆ తర్వాత సినిమాకి వర్క్ చేయను అని చెప్పేసాడట .కానీ గోపీచంద్ , నిర్మాత ఆయనను కూల్ చేసి సినిమాని కంటిన్యూ చేసేలా కోరారట . అంతేకాదు బాలయ్య సైతం మళ్లీ ఆయనతో ఇదివరకట్ల నార్మల్ గా ఉన్నాడని.. ఆ కోపం కొద్దిసేపు ఉండిందని స్వయానా కాస్ట్యూమ్ వర్కర్ చెప్పుకొచ్చిన్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా సరే బాలయ్యతో షూటింగ్ అంటే జర జాగ్రత్తగా ఉండాల్సిందే బాసూ అంటున్నారు నందమూరి ఫ్యాన్స్.