సినిమా పరిశ్రమ అంటేనే అది ఒక మాయా ప్రపంచం. అందులో ఉన్న సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలంటే ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. వారికి సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో కనిబడితే వాటి మీద సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాలో వారి పర్సనల్ లైఫ్ కు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా లీక్ అవుతూ ఉంటున్నాయి. మొన్నటికీ మొన్న విరాట్ కోహ్లీ తన పర్సనల్ రూమ్లో ఉన్న ఒక వీడియో లీక్ అయ్యి ఎంత పెద్ద సంచలనం అయిందో అందరికీీ తెలిసిందే.
ఇక వారు సెలబ్రిటీలు కాబట్టి వారి విషయాలు అందరికీ తెలిసిపోతాయి.. ఇక సాధారణ ప్రజల పరిస్థితి మరీ ఘోరంగా ఉందని చెప్పాలి. హోటల్ రూమ్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి వారి పర్సనల్ వీడియోలను షూట్ చేసి వారికి పంపించి డబ్బులు డిమాండ్ చేసే వారు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ వీడియోల పై నటి దియా మీర్జా సంచలన కామెంట్లు చేసింది. ఇక ఈమె తెలుగులో నాగార్జున హీరోగా వచ్చిన వైల్డ్ డాగ్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన ఈ భామ.. రీసెంట్గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ‘హీరోయిన్ బాత్ రూమ్ వీడియో లీక్ అవ్వడం చూసి భయపడ్డాను అని చెప్పింది.
అలాంటి వార్తలు వచ్చినప్పుడు నుంచి నాకు హోటల్ కి వెళ్లాలంటే భయం వేసిందని.. హోటల్ కి వెళ్లిన చాలా జాగ్రత్తగా ఉంటానని చెప్పింది’. ‘నా చిన్న వయసులో హీరోయిన్ల పర్సనల్ వీడియోలు సోషల్ మీడియాలో కనిపించడంతో నేను చాలా భయపడ్డానని. అప్పటినుంచి నేనున్నా పర్సనల్ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటున్నానని’.. ‘నేను ఎక్కడికైనా వెళ్తే ఆ హోటల్కు నేను వచ్చాకే రూమ్ ఓపెన్ చేయాలని, ఆ హోటల్ కి ఉన్న ప్రోటో కాల్ ప్రకారం అన్ని చేసి రహస్య కెమెరాలు ఉన్నాయా లేదా..? అని రూమ్ మొత్తం చెక్ చేసుకున్న తర్వాతే రూమ్ కి వెళ్లే దాని చెప్పింది’. ప్రస్తుతం ఈమె మాటలాడిన మాటలు సోషల్ మీడియాలో తేగా వైరల్ గా మారాయి.