సినిమాల్లో మెగాస్టార్గా ఉన్న చిరంజీవి..రాజకీయాల్లో పెద్దగా సక్సెస్ కాలేదు..అయితే ఇక తన రాజకీయాలు పెద్దగా పడవని చెప్పి మళ్ళీ సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్నారు. కానీ చిరంజీవి రాజకీయాలు వదిలేసినా..ఆయన్ని మాత్రం రాజకీయాలు వదలడం లేదు. ఎప్పుడు ఏదొరకంగా ఆయన చుట్టూ రాజకీయం నడుస్తూనే ఉంది. కాకపోతే చిరంజీవి సోదరుడుగా ఉన్న పవన్ జనసేన పెట్టి రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. దీంతో చిరు మద్ధతు పవన్కు ఉంటుందని మెగా ఫ్యాన్స్ ఆశించారు.
కానీ అది జరగలేదు. పైగా చిరంజీవి సినిమా ఇండస్ట్రీ కోసం పదే పదే జగన్ని కలవడం, ఆయనతో సన్నిహితంగా ఉండటంతో..ఇంకా చిరు వైసీపీ మద్ధతుదారుగాగా ముద్రవేసుకున్నారు. దీనిపై జనసేన సైనికులు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. అటు టీడీపీ శ్రేణులు సైతం చిరంజీవిని టార్గెట్ చేసి గట్టిగానే విమర్శలు చేశాయి. అయితే కానీ తాజాగా సీన్ రివర్స్ అయింది. చిరంజీవిపై వైసీపీ ఫ్యాన్స్ ఫైర్ అవుతుంటే…టీడీపీ-జనసేన శ్రేణులు సపోర్ట్ గా ఉంటున్నారు.
తాజాగా గాడ్ఫాదర్ సినిమా ప్రమోషన్లో భాగంగా చిరంజీవి రాజకీయాల గురించి మాట్లాడుతూ.. భవిష్యత్తులో పవన్కు తాను మద్దతు ఇస్తానేమోనని చెప్పుకొచ్చారు. పవన్ లాంటి నిబద్ధత కలిగిన నాయకుడు రావాలనేదే తన ఆకాంక్ష అని, అందుకోసం తన సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. పవన్కు రాష్ట్రాన్ని ఏలే అవకాశం ప్రజలు ఇచ్చే రోజు రావాలని తాను కోరుకుంటున్నానని చిరు అన్నారు.
అంతే ఇంకా పవన్కు మద్ధతు అని చిరు ఎప్పుడైతే అన్నారో..అప్పటినుంచి వైసీపీ శ్రేణులు ఫైర్ అవుతూ వస్తున్నారు. మీరు మద్ధతు ఇచ్చిన కాంగ్రెస్ ఏమైందో తెలుసని కౌంటర్లు వేస్తున్నారు. అలాగే గాడ్ఫాదర్ సినిమాపై నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. ఇక వైసీపీ వాళ్ళకు జనసేన శ్రేణులే కాదు..టీడీపీ శ్రేణులు కౌంటర్లు ఇస్తున్నాయి. మొత్తానికి రాజకీయం ఒక్కసారిగా రివర్స్ అయిపోయింది..మొన్నటివరకు చిరంజీవిని పొగిడిన వైసీపీ శ్రేణులు ఇప్పుడు విమర్శిస్తున్నాయి..విమర్శించిన వారు ఇప్పుడు సపోర్ట్ గా ఉంటున్నారు.