బాలయ్య అన్ స్టాపబుల్లో ఈ సారి యువ హీరోలు..!!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సినిమాలలో బిజీగా ఉంటూనే.. మరొకవైపు రాజకీయాలలో.. మరొకవైపు ఆహాలో అన్ స్టాపబుల్ షోలో హొస్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇక బాలయ్యలో తెలియని మరొక కోణాన్ని బయటపెట్టారని చెప్పవచ్చు. తన స్టైల్లో వచ్చి గెస్ట్ లను తికమక పెడుతూ ప్రేక్షకులను బాగా అలరిస్తూ ఉన్నారు. బాలయ్య మొదటి సీజన్ సూపర్ సక్సెస్ కావడంతో ఇప్పుడు అదే జోష్తో సీజన్-2 ని రెట్టింపు ఉత్సాహంతో మొదలుపెట్టారు. మొదట ఎపిసోడ్ కు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ రావడం జరిగింది. ఇక ఆ తరువాత రెండో ఎపిసోడ్ కు యువ హీరోలు విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ హాజరయ్యారు.

Image

ఇక ఈ రెండు ఎపిసోడ్లు మంచి క్రేజ్ ను తెచ్చుకున్నాయి. కాబట్టి ఇప్పుడు తాజాగా మూడో ఎపిసోడ్ పై ప్రతి ఒక్కరికి ఆసక్తి రేపుతోంది. ఈ ఎపిసోడ్ కు మరో ఇద్దరు యువ హీరోలు హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి ఆన్ స్టాపబుల్ సీజన్ -2 కు ఇప్పుడు మరో ఇద్దరు కుర్ర హీరోలు శర్వానంద్, అడవి శేషు హాజరు కాబోతున్నట్లు గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.

Image
ఈ వార్తలను సైతం నిజం చేస్తూ ఆహా కొన్ని స్టిల్స్ ను రివిల్ చేయడం జరిగింది. ఈ స్టిల్స్ చూస్తుంటే కుర్ర హీరోలతో పోటీగా బాలయ్య ఎనర్జిటిక్ గా కనిపిస్తూ ఉన్నారు. ఇక ఇటీవలే అడవి శేషు నటించిన చిత్రాలు అన్ని సూపర్ డూపర్ హిట్టుగా నిలుస్తున్నాయి. శర్వాన వరుస ప్లాపులతో సతమతమవుతున్న సమయంలో ఒకే ఒక జీవితం మంచి విజయాన్ని అందించిందని చెప్పవచ్చు. మరి బాలకృష్ణ ఇద్దరు యువహీరోలతో అభిమానులను ఎలా మెప్పిస్తారో చూడాలి. నవంబర్ 4వ తేదీన ఈ ఎపిసోడ్ స్ట్రిమ్మింగ్ కాబోతోంది.

https://twitter.com/ahavideoIN/status/1586635915526823937?s=20&t=PN6LW86ZKHtidL4op63C2g