ఇప్పుడు ఎక్కువగా వెండితెర కంటే బుల్లితెర పైన ఎంతోమంది క్రేజీ సంపాదించుకుంటున్నారని చెప్పవచ్చు ఒకప్పుడు బుల్లితెరపై ఎక్కువగా సీరియల్స్ మాత్రమే ప్రసారమవుతూ ఉండేవి. కానీ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ షోలు కూడా రావడంతో బుల్లితెర మరింత క్రేజ్ ను సంపాదించుకుంది. ఇలా బుల్లితెర పైన ఎక్కువమంది నటించడానికి ఇష్టపడుతున్నారు నటీనటుల సైతం. ఇక వీరి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అంతే పెరిగిపోతుందని చెప్పవచ్చు. ఇక రెమ్యూనరేషన్ కూడా భారీగానే డిమాండ్ చేస్తూ ఉంటారు. అందుచేతనే ఎంతోమంది సెలబ్రిటీలు సైతం బుల్లితెర పైన సందడి చేయడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు.
ఇక అసలు విషయంలోకి వెళితే రెమ్యూనరేషన్ విషయంలో బుల్లితెర నటీనటులు చాలా తక్కువగా అందుకుంటారని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ ఇదంతా కేవలం అపోహ మాత్రమే అని చెప్పవచ్చు. ఎందుచేత అంటే ఒక సీరియల్ బాగా పాపులర్ అయిందంటే చాలు ఆ సీరియల్స్ లో నటించే నటీనటులు సైతం ఎక్కువ రేమ్యునరేషన్ అందుకుంటూ ఉంటారు. అలా ఇప్పుడూ ఒక సీరియల్ నటి అందుకున్న పారితోషకం తెలిస్తే ప్రతి ఒక్కరు కూడా నోరెళ్ళ పెట్టాల్సిందే. ఆ నటి ఎవరో కాదు బాలీవుడ్ తెరపై ఎన్నో సీరియల్స్ లో నటించిన రూపాలీ గంగోలి.
ఈనటి సారా భాయ్ వర్సెస్ సార్ అబ్బాయి అనే సీరియల్స్ లో నటించి మంచి విజయాన్ని అందుకుంది ఈ సీరియల్స్ ద్వారా ఎంతో మంది ప్రేక్షకు ఆదరణ పొందింది ఆ తర్వాత అనుపమ అనే ఒక సీరియల్స్ లో నటించింది. దీంతో ఈమె క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఫస్ట్ లో ఒక్కో ఎపిసోడ్ కి రూ.1.7 లక్షల రూపాయల వరకు అందుకునేదట. అయితే తాజాగా మాత్రం పలు సీరియల్ లో నటించడానికి ఒక్కో ఎపిసోడ్ సీరియల్ కి రూ.3 లక్షల రూపాయలు వరకు అందుకుంటున్నట్లు సమాచారం. ఇక దీంతో ఇండియాలోనే బుల్లితెరపై నటీనటులలో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్న నటిగ పేరు పొందింది.