ఏటా దసరా పండుగ సందర్భంగా భారతదేశంలో సరికొత్త సినిమాలు విడుదలవుతుంటాయి. అయితే మొన్నటి వరకు థియేటర్లలో విడుదల అయ్యే కొత్త సినిమాలు ఇప్పుడు ఓటీటీలలో కూడా విడుదలవుతూ వినోదాన్ని పంచుతున్నాయి. కాగా ఈసారి ఆల్రెడీ థియేటర్లలో రిలీజైన కొత్త సినిమాలతో పాటు కొన్ని డైరెక్ట్గా ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
జీ5 ఓటీటీ ప్లాట్ఫామ్ ఇటీవల కాలంలో తెలుగులో సూపర్ హిట్టయిన సినిమాలను ఎక్కువగా కొనుగోలు చేస్తోంది. రీసెంట్గా హిట్ అయిన కార్తికేయ 2ని కూడా కొనుగోలు చేసింది. దీనిని ఈరోజు అంటే దసరా పండుగ సందర్భంగా రిలీజ్ చేసింది. అక్టోబర్ 5న కార్తికేయ 2ని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేసింది. అలాగే ఇదే రోజున గాలిపట 2 (కన్నడ), రక్షాబంధన్ (హిందీ) సినిమాలను కూడా రిలీజ్ చేసింది. ఇక ఎక్స్క్లూజివ్ గా తెలుగు కంటెంట్ అందించే ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈరోజు దర్జా, ఉనికి అనే రెండు సినిమాలను రిలీజ్ అయ్యాయి. అనసూయ, సునీల్ నటించిన తాజా సినిమా కొన్ని రోజుల క్రితమే థియేటర్లలోకి వచ్చింది. ఉనికి అనేది ఫీమేల్ ఓరియంటెడ్ డ్రామాగా ప్రేక్షకులను పలకరించింది.
ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్లో దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 6న మజా మా (హిందీ) విడుదల కానుంది. నెట్ఫ్లిక్స్లో రేపు ఒరు తెక్కన్ తల్లు కేస్ మూవీ మలయాళం, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో వస్తుంది. రంగ రంగ వైభవంగా ఇప్పుడు ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. మొత్తంగా చూసుకుంటే తెలుగు సినీ అభిమానులను ఈరోజు అలరించడానికి కార్తికేయ 2, దర్జా, ఉనికి, రంగ రంగ వైభవంగా సినిమాలు రిలీజ్ అయ్యే అని చెప్పవచ్చు. ఇందులో కార్తికేయ 2 సినిమా చూసి బాగా ఎంజాయ్ చేయొచ్చు. మిగతావి టైం పాస్ అయ్యేందుకు చూడొచ్చు.