తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవి రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ మధ్యకాలంలో చిరంజీవి రేంజ్ కు తగ్గట్టుగా సినిమాలు ఏ మాత్రం సరిపోవడం లేదని ఆయన అభిమానులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇటీవల విడుదలైన గాడ్ ఫాదర్ సినిమాతో పాటు ఆయన చేయబోతున్న తదుపరిచిత్రాలు విషయంలో కూడా ఇలాంటి అసంతృప్తినే తెలియజేస్తున్నట్లు సమాచారం. వాల్తేరు వీరయ్య ప్రస్తుతం సినిమా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్నారు. ఇక డైరెక్టర్ కూడా గతంలో పెద్దగా సక్సెస్ సాధించిన ఘనత చాలా తక్కువగానే ఉందని చెప్పవచ్చు.
ఇక మెహర్ రమేష్ ఇలాంటి ఘోరమైన ట్రాక్ రికార్డు ఉన్న డైరెక్టర్లతో సినిమా విషయంలో అభిమానులలో కాస్త నిరుత్సాహ చెందుతున్నట్లుగా సమాచారం. ఇక మరొక డైరెక్టర్ వెంకీ కుడుములతో చేయబోతున్న చిత్రంపై కూడా పలు అనుమానాలకు దారితీస్తున్నాయట. చిరంజీవి రేంజ్ కు తగ్గట్టుగా ఈ డైరెక్టర్ కాదని అభిమానులు భావిస్తున్నారు. చిరంజీవి రేంజ్కి త్రివిక్రమ్, సుకుమార్ ఇతర డైరెక్టర్లతో సినిమా చేయాలన్నది అభిమానుల కోరిక. ఇలాంటి కాంబినేషన్ కోసమే అభిమానులు ఎదురుచూస్తున్నట్లుగా పలు రకాలుగా సోషల్ మీడియాలో తెలియజేస్తూ ఉన్నారు. ఇక డైరెక్టర్ పూరీకి కూడా చిరంజీవి అవకాశం ఇవ్వడం కొంతమందికి నచ్చలేదని సమాచారం.
ఇక చిరంజీవి కోసమే గతంలో ఆటో జానీ అనే సినిమా కథను సిద్ధం చేశారు పూరి జగన్నాథ్.ఇప్పుడు ఆ కథను పక్కన పెట్టి మరొక కొత్త కథతో వస్తానని పూరి జగన్నాథ్ తెలియజేశారు. ఇక చిరంజీవి కూడా మీరు ఎప్పుడు వచ్చిన కచ్చితంగా సినిమా చేద్దామని తెలియజేయడం జరిగిందట. దీంతో పూరి చాలా ఉత్సాహంతో ఈ సినిమా కథతో మీ దగ్గరికి వస్తానని ఇంస్టాగ్రామ్ వేదికగా పలు ప్రశ్నలలో తెలియజేసినట్లు సమాచారం. ఇక పూరి తెరకెక్కించిన గత లైగర్ చిత్రం భారీ డిజాస్టర్ ని చవిచూసింది. ఇలా చిరంజీవి తెరకెక్కించే ప్రతి సినిమాలు కూడా ఎక్కువగా డైరెక్టర్ల ఫ్లాప్ లిస్టులో ఉన్నవే. అందుచేతనే అభిమానులు కాస్త ఆందోళనలో ఉన్నట్లు సమాచారం.