మరొకసారి ఎలక్షన్లను టార్గెట్ చేస్తున్న జగన్.. మళ్లీ ప్రేక్షకులను..!!

రెండు తెలుగు రాష్ట్రాలలో దివంగత రాజశేఖర్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈయన జీవిత కథ ఆధారంగా యాత్ర సినిమా విడుదలై ప్రేక్షకులను ఇప్పటికి కూడా ఆకట్టుకుంటూ ఉంటుంది. దర్శకుడు మహి వీ రాఘవ ఈ సినిమా ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు . ఈ సినిమా విదంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఆ సినిమా అప్పట్లో హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. ముఖ్యంగా కరెక్ట్ గా ఎన్నికల సమయం ముందు ఈ సినిమాని భారీ స్థాయిలో విడుదల చేయడంతో వైయస్సార్ పార్టీకి ఈ సినిమా ద్వారా కాస్త లాభం చేకూరిందని చెప్పవచ్చు.

Watch Yatra (Malayalam) | Prime Video
మళ్లీ కూడా ఇప్పుడు అలాంటి ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం ఈ సినిమా సీక్వెల్ రాబోతున్నట్లు టాక్ బాగా వినిపిస్తోంది. గతంలో యాత్ర సినిమాకు కొనసాగింపు ఈ యాత్ర -2 సినిమాలో జగన్మోహన్ రెడ్డి బయోపిక్ ను చూపించబోతున్నట్లు కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో దుల్కర్ సల్మాన్ ను వైయస్ జగన్ పాత్రలో కనిపించే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయం గురించి ఇప్పటివరకు దుల్కర్ సల్మాన్ని అడగగా తను మాత్రం ఆ విధంగా అయితే తనకు ఎలాంటి ఆఫర్ రాలేదని విషయాన్ని తెలియజేశారు.

Yatra full movie box office collections day 2: Mahi V Raghav and  Mammootty's film rakes in Rs 4.40 Cr share worldwide
ఒకవేళ నిజంగానే అలాంటి పాత్ర వస్తే ఆ పాత్ర గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని తెలియజేశారు. ఇక ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం మహి రాఘవ మల్లి యాత్ర-2 సినిమా సీక్వెల్ ను వచ్చే ఎన్నికలలోపు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తున్నది. ఇందులో వైయస్ జగన్ కు సంబంధించి పలు అంశాలను కూడా హైలెట్ చేసే విధంగా చేయబోతున్నట్లు సమాచారం . రాజశేఖర్ రెడ్డి గా మలయాళం నటుడు మమ్ముట్టి చాలా అద్భుతంగా నటించారని చెప్పవచ్చు. ఇప్పటికీ కూడా ఆ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటుంది. మరి యాత్ర -2 సినిమా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు చూడాలి ఈ సినిమా 2024 ఎన్నికల ముందు విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ ప్లాన్ వెనక జగన్ నిర్ణయమే ఉన్నట్లు సమాచారం.