తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార చిత్రం విడుదలయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని మల్లిడి వశిష్ట దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆగస్టు 5వ తేదీన విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంతో కళ్యాణ్ రామ్ కు మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అదే స్థాయిలో డైరెక్టర్ వశిష్ట కూడా మంచి గుర్తింపు పొందారు. ఈ సినిమా చూసిన ఎంతోమంది డైరెక్టర్లు సైతం అతనిని ప్రశంసించారు.
అయితే ఈ క్రమంలో బింబిసార చిత్రానికి వశిష్ట ఎంతటి పారితోషకం తీసుకున్నారనే విషయం సోషల్ మీడియాలో పలు చర్చలకు దారితీస్తోంది. మరి ఈ విషయంపై పలు వార్తలు వైరల్ గా మారుతున్నాయి కళ్యాణ్ రామ్ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం రూ. 40 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించిందని చిత్ర బృందం అంచనా వేస్తోంది. ఇక ఈ చిత్రం కళ్యాణ్ రామ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ గా నిలిచిందని చెప్పవచ్చు. ఇప్పటివరకు అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా బింబిసార చిత్రం నిలిచింది. దీంతో కళ్యాణ్ రామ్ తెలుగు సినీ ఇండస్ట్రీ మార్కెట్ కూడా మరింత పెరిగిపోయిందని చెప్పవచ్చు.
అయితే డైరెక్టర్ వశిష్ట ఈ చిత్రం షూటింగ్ కి కాను నెలవారి జీతం తీసుకున్నట్లుగా సమాచారం. అంటే దాదాపుగా రూ. 80 లక్షల రూపాయల వరకు తీసుకున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం బింబిసార-2 సినిమా సిక్వెల్ పైన పనిచేస్తున్నారు. దీంతో కళ్యాణ్ రామ్ డైరెక్టర్ కు రూ.3 కోట్ల రూపాయలు ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక తీయబోతున్న రెండవ చిత్రానికి ఇంతటి రెమ్యూనికేషన్ అందుకోవడంతో ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతొంది.