శాండిల్ వుడ్ లో మొదట కిరాక్ పార్టీ చిత్రంతో పరిచయమైన కన్నడ ముద్దుగుమ్మ రష్మిక ఆ తర్వాత ఛలో సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ చిత్రంతోనే ఈమె అదృష్టం ఒకసారిగా మలుపు తిరిగిందని చెప్పవచ్చు. అటు తర్వాత గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, పుష్ప వంటి చిత్రాలతో పాన్ ఇండియన్ హీరోయిన్ గా కూడా పేరు పొందింది. ఇక అలా బాలీవుడ్ లో కూడా అమితాబచ్చన్ తో కలిసి తాజాగా గుడ్ బై చిత్రంలో నటించిన ఈ సినిమా విడుదల అవ్వగా పెద్దగా సక్సెస్ కాలేక పోయింది.
ప్రస్తుతం బాలీవుడ్ లో కొన్ని చిత్రాలలో నటిస్తూ ఉన్నది. కోలీవుడ్లో కేవలం ఒక్క చిత్రం చేస్తు బిజీ గా ఉంది. పుష్ప-2 సినిమా త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది ఇక దీపావళి పండుగను తన కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని తన సొంత ఊరికి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించి రష్మిక ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేసింది. తను ఎంత బిజీగా ఉన్నా పండుగలు, పర్వదినాలను మాత్రం తన కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని ఇష్టపడతానని తెలియజేసింది. అంతేకాకుండా ముఖ్యమైన పండుగ రోజులలో బంగారం వెండి ఆభరణాలను కొనుగోలు చేయడం అంటే తనకు చాలా సెంటిమెంట్ అని తెలియజేసింది.
ఇక ఈ సెంటిమెంటును మాత్రం ఎప్పటికీ వదలనని తెలియజేసింది రష్మిక. ఇప్పుడు తన నూతన చిత్రాల ప్రారంభానికి ముందు బంగారం గానీ, వెండిని గాని కొనిగేలు చేస్తూ ఈ సెంటిమెంట్ను కొనసాగిస్తూనే ఉంటానని తెలిపింది. తనను తన చెల్లిని తన తండ్రి మీరు మా ఇంటి మహాలక్ష్మిలు అని పిలుస్తూ ఉంటారని తెలియజేసింది. అది కూడా తనకు చాలా గర్వంగా అనిపిస్తుంది అని తెలియజేసింది రష్మిక.