నార్మల్ అబ్బాయిలు తట్టుకోలేరంటూ.. పెళ్లి పై షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రీ రెడ్డి..!!

శ్రీ లేఖ అలియాస్ శ్రీ రెడ్డి.. టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు.. వివాదాలకు, వివాదాస్పద అంశాలకు ఎప్పుడూ దగ్గరగా ఉండే ఈమె తాజాగా పెళ్లి గురించి స్పందిస్తూ షాకింగ్ కామెంట్లు చేసింది.. టాలీవుడ్ లో ఏ విషయంపై అయినా ఈమె మాట్లాడినా సరే క్షణాల్లో అది వైరల్ అవుతూ ఉంటుంది. ఇక ఈ క్రమంలోనే పెళ్లి గురించి మనసులో మాట బయట పెట్టడంతో మరొకసారి వైరల్ అవుతోంది. ఇకపోతే ఇప్పటివరకు పెళ్లి విషయంలో ఒక్కరు కూడా సరైన వ్యక్తి అని నాకు అనిపించలేదు. చాలామంది అబ్బాయిలు ప్రపోజ్ చేసి, డేటింగ్ చేసి ఆ తర్వాత పక్కన పెట్టే విధంగా ఉన్నారు.. సంసారాన్ని నిలబెట్టుకునే అంత పద్ధతిగా కాపురం చేసుకుందామనే వాళ్లు ఇప్పటివరకు కనిపించలేదు అంటూ శ్రీరెడ్డి తెలిపింది.

Srireddy : నాటు కోడి వండుతా... అందాలు – Telugu Online News
రివర్స్ లో చెబుతున్నాను అనిపిస్తోందా అంటూ కూడా కామెంట్లు చేసింది.. ఇకపోతే నేను చాలా టిపికల్ క్యారెక్టర్ , నన్ను మ్యారేజ్ చేసుకోవడం నార్మల్ అబ్బాయిల వల్ల కాదు ..అసలు వాళ్ళు తట్టుకోలేరు… చాలా హై థింకింగ్, పెద్ద మనసు ఉన్న వాళ్ళు మాత్రమే నన్ను పెళ్లి చేసుకోవడం సాధ్యమవుతుంది అంటూ కూడా కామెంట్లు చేసింది. ఇకపోతే పార్టీలకు వెళ్ళిన సమయంలో కొంతమంది నచ్చుతారు.. కానీ వాళ్లకి అప్పటికే పెళ్లిళ్లు అయిపోయాయి అంటూ శ్రీరెడ్డి వెల్లడించింది.. ఇకపోతే ఒంటరిగా ఉండడం పెద్ద జబ్బు అని రతన్ టాటా చెప్పారని , కానీ ఒంటరిగా ఉంటే మనల్ని మనం మెరుగుపరుచుకోవడం సాధ్యమవుతుందని కూడా తెలిపింది.

ముఖ్యంగా ఒంటరితనం వల్ల స్కిల్స్ డెవలప్ చేసుకోవచ్చు.. అది ఒక భోగం.. 90% ఒంటరిగా ఉండటం వల్ల చాలా సంతోషంగా ఉంటామని కూడా చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం శ్రీరెడ్డి అటు పెళ్లి పై ఇటు ఒంటరితనంపై మరొకవైపు నార్మల్ వ్యక్తిత్వం కలిగిన అబ్బాయిలపై చేసిన కామెంట్లు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారుతున్నాయి.