స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం అనారోగ్య సమస్యతో బాధపడుతున్న విషయం అందరికీ తెలిసిందే.. మైయో సిటీస్ అనే జబ్బుతో ఈమె బాధపడుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. ఈ విషయం తెలిసిన అభిమానులు,సినీ ప్రేక్షకుల సైతం సమంత ఆరోగ్యం గురించి చాలా ఆందోళన చెందుతున్నారు. అయితే సమంత త్వరగా కోలుకోవాలని ప్రతి ఒక్కరు కూడా దేవుడిని ప్రార్థిస్తూ పోస్టులు చేస్తూ ఉన్నారు. ఇక సమంత అరుదైన వ్యాధితో పోరాడుతున్నట్లు ఈ విషయాన్ని తానే స్వయంగా తెలియజేసింది. ఈ విషయం తెలిసిన సెలబ్రిటీలు సైతం సోషల్ మీడియా వేదికగా కోలుకోవాలని ఎన్టీఆర్ ,చిరంజీవి ,రామ్, నాని ,అడవి శేషు సాయి పల్లవి ,రకుల్ ,జాన్వి కపూర్ తదితరులు సైతం సమంతకు ధైర్యం చెబుతూ ఉన్నారు.
అయితే సమంత ఆరోగ్యం పై అక్కినేని కుటుంబ సభ్యులు ఎలా స్పందిస్తారో అని అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో అఖిల్ మరియు అదే ఫ్యామిలీకి చెందిన సుశాంత్ సమంత గురించి పోస్ట్ చేయడం జరిగింది.నీకు మరింత బలాన్ని శక్తి చేకూరాలని కోరుకుంటున్నాను సామ్ అంటూ తెలియజేశారు. నువ్వు దీన్ని అధిగమించగలవు అని తెలియజేశారు. సమంత ఇంస్టాగ్రామ్ పోస్ట్ పై అఖిల్ స్పందిస్తూ డియర్ సామ్ నీకు అందరీ ప్రేమ మరియు మరింత ధైర్యం చేకూరాలని కోరుకుంటున్నానని తెలియజేశారు.
కానీ నాగార్జున, నాగచైతన్య, అమల మాత్రం మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే దగ్గుబాటి కుటుంబం కూడా సమంత విషయంపై స్పందించలేదు. ప్రేమ వివాహం చేసుకున్న నాగచైతన్య ,సమంత గత సంవత్సరం అక్టోబర్ నెలలో విడిపోయారు. ఆ తర్వాత నాగార్జున మరియు చైతన్య సమంత గురించి పబ్లిక్ వేదికగా మంచి విషయాలను తెలియజేశారు. మరి సమంత ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని కోరుకుంటారో లేదో చూడాలి. ఈ నేపథ్యంలో సమంతాన్ని కలవడానికి అక్కినేని కుటుంబం వ్యక్తిగతంగా కలవడానికి సిద్ధమవుతున్నారని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి ఇది నిజమో కాదు తెలియాల్సి ఉంది.