ఆ హీరో డ్యాన్స్ అంటే పిచ్చి.. సెట్ లో అదుంటే చాలు అంటున్న సాయిపల్లవి!

పరిచయమే అక్కర్లేని నటి సాయిపల్లవి. ఈ ఫిదా యాక్ట్రెస్ అటు మలయాళం.. ఇటు తెలుగు, తమిళం సినిమాల్లో విభిన్న పాత్రలు చేస్తున్న తనకంటూ ఓ కొత్త ఫాలోయింగ్ తెచ్చుకుంది. ఇక మంచి డ్యాన్సర్‌గా కూడా ఈ అందాల తార పేరు తెచ్చుకుంది. ఏ హీరో అయినా సరే ఈమె డ్యాన్స్ ముందు చిన్నబోక తప్పదు. సాయి పల్లవి ధనుష్ తో నటించిన మారీ సినిమాలో లవ్లీ బేబీ పాటకు అద్భుతంగా డాన్స్ చేసి మంచి ఫేమ్ కూడా తెచ్చుకుంది. ఈ తార భారీ పారితోషకం గురించి ఆలోచించకుండా అసభ్యకర సన్నివేశాలు ఉన్న పెద్ద ప్రాజెక్టులను సింపుల్ గా వదిలేసింది. ఈ అందాల బొమ్మ యాక్షన్ అయినా సరే డ్యాన్స్ అయినా సరే తన నటనతో అదరగొడుతోంది. ఎక్స్‌పోజింగ్ చేయకుండా నటించడమే సాయిపల్లవి ప్రత్యేకత.

ఈ బ్యూటీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు బయట పెట్టంది. తను పూర్తిగా శాకాహారినని.. అన్నం, పప్పు ఉంటే చాలని చెప్పింది. సెట్ లో కొబ్బరినీళ్లు, మజ్జిగ ఉంటే ఇంకేం అడగనని చెప్పుకొచ్చింది. అసలు బరువు పెరగనని.. అందుకే జిమ్‌లో కసరత్తులు చేసే అవసరమే తనకి రావడంలేదని తెలిపింది. అప్పుడప్పుడు సరదాగా బాడ్మింటన్ ఆడతానని తెలిపింది. సోషల్ మీడియా గురించి మాట్లాడుతూ.. అదొక టైమ్ వేస్ట్ వ్యవహారమని చెప్పింది.

అయితే దీనితో పాటుగా సినీ పరిశ్రమలో తనకు ఇష్టమైన డ్యాన్సర్ అల్లు అర్జున్ అని చెప్పింది. బన్నీ డ్యాన్స్ అంటే తనకు పిచ్చి అని.. అతనితో తానింకా ఒక్క సినిమా కూడా చేయలేదని చెప్పంది. ఇక డ్యాన్స్ తానెలా నేర్చుకుందో కూడా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. మాధురి దీక్షిత్ డ్యాన్స్ వీడియోలు చూసి ఆమె లాగా తాను కూడా చేయాలనుకుందట. అలా ఆమె వేసిన స్టెప్పులు ప్రాక్టీస్ చేస్తూ డ్యాన్స్‌పై మక్కువ పెంచుకున్నానని చెప్పుకొచ్చింది. అలానే టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు గ్లామర్ గురించి కూడా తెగ పొగిడేసింది.