అదరహో అనిపిస్తున్న హన్సిక అందాలు.. మ్యారేజ్ కోసం ఆ ప్యాలెస్ బుక్!

ముట్టుకుంటే కందిపోయే అందం, పట్టుకుంటే మాసిపోయే తెల్లదనంతో సూపర్ క్యూట్‌గా కనిపించే హీరోయిన్ హన్సిక మోత్వానీ. ఈ ముంబై ముద్దుగుమ్మ అల్లు అర్జున్ దేశముదురు సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. తన అందమైన లుక్స్, గ్లామర్‌తో అనేక మందిని ఫ్యాన్స్‌ చేసుకుంది. తారక్‌తో కలిసి కంత్రి, రామ్‌తో కలిసి కందిరీగ, మస్కా వంటి సినిమాలలో చేసి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తరువాత తమిళంలో చాలా సినిమాలు చేసింది. ఇప్పుడు తెలుగులో మై నేమ్ ఇస్ శృతి, 105 మినిట్స్ సినిమాలు చేస్తోంది. తమిళంలో మరొక నాలుగు సినిమాలలో కూడా ఈ పంచదార బొమ్మ నటిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ క్యూట్ యాక్ట్రెస్‌కి సంబంధించి ఒక న్యూస్ వైరల్‌గా మారింది.

ముంబైకి చెందిన ఓ బడా వ్యాపారవేత్తతో హన్సిక కొంతకాలంగా డేటింగ్‌లో ఉందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇంతకుముందు, తమిళ హీరో శింబుతో హన్సిక వివాహం జరగాల్సి ఉంది, అయితే ఈ జంట విభేదాల కారణంగా విడిపోవడంతో పెళ్లి ఆగిపోయింది. కాగా ఇప్పుడు ఒక వ్యాపారవేత్తతో ఆమె ఏడు అడుగులు నడవబోతోందని సమాచారం. డిసెంబర్ 2022లో హన్సిక పెళ్లికి సిద్ధమవుతోందని బాలీవుడ్ మీడియా రిపోర్ట్స్‌ పేర్కొంటున్నాయి. డిసెంబర్‌లో దాదాపు 10 రోజుల పాటు జైపూర్‌లోని ముండోటా ఫోర్ట్ & ప్యాలెస్‌ని హన్సిక కుటుంబం బుకింగ్ చేసినట్లు కొందరు మీడియా వారు తెలుసుకున్నారు.

పెళ్లికి సంబంధించిన కచ్చితమైన తేదీ, వరుడు వివరాలు తెలియనప్పటికీ, ఇప్పుడు హోటల్‌గా మారిన 450 ఏళ్ల రాజభవనంలో ఆమె వివాహం జరగనుందని అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. చాలా కాలం పాటు హీరోలతో డేటింగ్ చేసి వేరేవారిని పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్‌ల మాదిరిగానే హన్సిక కూడా ఒక గొప్ప వ్యాపారవేత్తను వివాహం చేసుకుంటోందని కొందరు కామెంట్ చేస్తున్నారు.