సీనియర్ స్టార్ దర్శకుడు ఇవివి సత్యనారాయణ నట వారసుడుగా సినిమాల్లోకి వచ్చిన అల్లరి నరేష్.. కామెడీ సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన అల్లరి సినిమాతో టాలీవుడ్కు పరిచయమయ్యాడు. మొదటి సినిమా పేరు నే తన ఇంటిపేరుగా మార్చుకున్న అల్లరి నరేష్ ..వరుస సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్ లో బిజీగా ఉన్నాడు.. గత కొంతకాలంగా అల్లరి నరేష్ తన కెరియర్ లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
అయన నటించిన సుడిగాడు సినిమా తర్వాత ఆయనకు సరైన హిట్ పడలేదు. అప్పటినుంచి ఆయన తన కెరియర్ లో ఎన్నో ఇబ్బందులకు గురయ్యాడు. ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ ఆయనకు సక్సెస్ ఇవ్వలేకపోయాయి.ఇక తాజాగా వచ్చిన నాంది సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టాడు. ఈ సినిమాలో తన నటనతో అందరిని మెప్పించి సూపర్ హిట్ని తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇదిలా ఉండగా అల్లరి నరేష్ గురించి గతంలో ఒక వార్త బాగా వైరల్ అయింది. ఆ వార్త ఏమిటంటే అల్లరి నరేష్ తనకంటే పెద్దదైన పెళ్లయిన హీరోయిన్ ని ప్రేమించాడని.. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడని వార్తలు బయటకు వచ్చాయి.. ఆ హీరోయిన్ మరి ఎవరో కాదు అల్లరి నరేష్ హీరోగా వచ్చిన సీమశాస్త్రి, బొమ్మనా బ్రదర్స్ చందనా సిస్టర్స్ ఈ సినిమాలలో హీరోయిన్గా నటించిన ఫర్జానా.
ఈ సినిమాల షూటింగ్స్ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టిందట.. మీరిద్దరూ జతగా పలు ప్రదేశాలకు కూడా వెళ్లారు..ఫర్జానా రెండు మూడు సార్లు అల్లరి నరేష్ తో వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళింది. ఈ వార్త అప్పట్లో బాగా వైరల్ అయింది. అప్పటినుంచి వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుంది అంటూ వార్తలు షికారు చేశాయి. అప్పుడు అల్లరి నరేష్ ఇవేవీ నిజం కాదని మేమిద్దరం స్నేహితుల మాత్రమే అని ఆవిడ పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోయిందని చెప్పడంతో అప్పటినుంచి ఈ వార్తలు ఆగిపోయాయి.