తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. అయితే తాజాగా వీరిద్దరూ కలిసి అహలో అన్ స్టాపబుల్-2 షో కి చంద్రబాబు నాయుడు ,తన కుమారుడు లోకేష్ గెస్ట్ గా రావడం జరిగింది. అయితే ఇలా వెళ్లడంపై మాజీమంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వాటి గురించి ఇప్పుడు పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం.
కొడాలి నాని మాట్లాడుతూ.. ఎన్టీఆర్ మరణించి ఇప్పటికీ 25 సంవత్సరాలు దాటిన షోల పేరుతో కొడుకు అల్లుడు ఆ మహానీయుడిని హింసిస్తున్నారని విమర్శించారు. తండ్రిని చంపిన చంద్రబాబుతో షోలు చేస్తున్న బాలకృష్ణకు అసలు సిగ్గుందా అంటూ ప్రశ్నిస్తున్నారు కోడాలి నాని. నిన్నటి రోజున గుడివాడ ఐదవ వార్డు శ్రీరామపురంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న కొడాలి నాని మీడియాతో మాట్లాడడం జరిగింది. ఇక అంతే కాకుండా అక్కడ ప్రజల సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నారు. ఇక అదే విధంగా చంద్రబాబు నాయుడు గతిలేక ఎన్నోసార్లు ఎన్టీఆర్ కాళ్లు పట్టుకున్నారని తెలియజేశారు.
ఎన్టీఆర్ కాళ్ళ దగ్గర ఉండే చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచి ఇప్పుడు ప్రజల కళ్ళు కప్పే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించడం జరిగింది. ఎన్టీఆర్కు పార్టీ నడపడం చేతకాకపోతే..చంద్రబాబు బయటికి పోవాలే.. కానీ ఆయన పార్టీ లాక్కోవడమేమిటి అంటూ ప్రశ్నించారు కొడాలి నాని. ఇక ఎన్టీఆర్ను మించిపోయి ఆయన కొడుకు బాలకృష్ణ నటిస్తున్నారని చంద్రబాబుతో కలిసి ఇలాంటి షోలు చేయడం చాలా సిగ్గు శరం అని తెలియజేస్తున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ అజ్ఞాని అని మరొకసారి నిరుపృతమైందని తెలియజేశారు. ప్రజలు ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజావాణి పెట్టాల్సిన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు చిల్లరలకు ఆశపడి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు కొడాలి నాని. ప్రస్తుతం ఈ విషయం కాస్త వైరల్ గా మారుతున్నాయి.