శ్రీదేవి నటవారసురాలుగా జాన్వీ కపూర్ ధడక్ చిత్రంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అలా తన మొదటి చిత్రంలో నటించినప్పుడే జాన్వీ కపూర్ త్వరలోనే బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పటివరకు ఈ ముద్దుగుమ్మ ఎలాంటి ఎంట్రీ ఇవ్వలేదు. ఇక ఇటీవల జాన్వీ ఒక అగ్ర హీరోతో తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతుందని వార్తలు చాలా వైరల్ గా మారాయి. ఈ పుకార్లలో రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు పేరు బాగా వినిపించాయి. అయితే ఇప్పటివరకు ఇలాంటివి ఏమీ జరగలేదు. ఇక ఈ మధ్యకాలంలో ఎన్టీఆర్, కొరటాల శివ కాంబో లో తెరకెక్కిస్తున్న ఎన్టీఆర్ 30వ సినిమాలో ఈమె నటించబోతోంది అని వార్తలు చాలా హాట్ టాపిక్ గా మారాయి.
అంతేకాకుండా జాన్వీ ని ఒప్పించేందుకు కొరటాల శివ తన వంతు ప్రయత్నం చేస్తున్నారనే వార్తలు చాలా వైరల్ మారాయి. ఆమె బిజీ షెడ్యూల్ కారణంగా డేట్లు కుదరలేదని వార్తలు వినిపించాయి. కానీ తాజా ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ 30వ సినిమా నుంచి తనకు ఎలాంటి అవకాశం రాలేదని తెలియజేసింది. ఒకవేళ అవకాశం వస్తే నో చెప్పే అవకాశం లేదని కూడా క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు మరొకసారి యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో నటించే అవకాశం వస్తే విడిచి పెట్టనని జాన్వి తెలియజేసింది.
“ఎన్టీఆర్ సార్ తో కలిసి పని చేసే అవకాశం నాకు చాలా ఇష్టం . అతను చాలా గొప్ప లెజెండ్. కానీ దురదృష్టవశాత్తు ఆఫర్ తనకి ఇంకా రాలేదని” తెలియజేసింది. ప్రస్తుతం తన తదుపరి సినిమాల షూటింగ్లో బిజీగా ఉంది జాన్వి కపూర్. “రామ్ చరణ్, ఎన్టీఆర్ నటించిన RRR చిత్రాన్ని చూశాను. ఇద్దరు చాలా అద్భుతంగా నటించారని తెలియజేసింది. ఇక టాలీవుడ్ లో ఎంట్రీకి ఆఫర్ వస్తే కచ్చితంగా వదులుకోనని ” తెలియజేస్తుంది ఈ ముందు గుమ్మ. మరి రాబోయే రోజుల్లో ఏ హీరోతో ఎంట్రీ ఇస్తుందో చూడాలి మరి.