చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రం ఇప్పుడు థియేటర్లో బాగానే సందడి చేస్తోంది. ఆచార్య సినిమా బారి డిజాస్టర్ తర్వాత డీల పడిన అభిమానులు గాడ్ ఫాదర్ చిత్రంతో కాస్త సాలిడ్ హిట్టుని చూపించారు చిరంజీవి. దీంతో అభిమానులు కాస్త ఆనందాన్ని తెలియజేస్తూ బాస్ ఇస్ బ్యాక్ అంటూ థియేటర్ల వద్ద నానా హంగామా చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకోవడమే కాకుండా కలెక్షన్ల పరంగా కూడా బాగానే రాబడుతున్నట్లు సమాచారం. మలయాళం మూవీ లూసిఫర్ చిత్రాన్ని రీమిక్కుగా తెరకెక్కించారు.
ఇక ఒరిజినల్ సినిమా కంటే ఈ సినిమానే బాగుందని పలువురు అభిమానులు సినీ ప్రేక్షకులు సైతం తెలియజేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా కీలకమైన పాత్రలో నటించారు. అలాగే నయనతార చిరంజీవికి చెల్లెలి పాత్రలో అద్భుతంగా నటించింది. ఇక ఇతర పాత్రలలో సత్యదేవ్ సునీల్, అనసూయ తదితరులు నటించారు. అయితే ఈ సినిమాలో సత్యదేవ్ నటించిన పాత్ర చాలా కీలకమని చెప్పవచ్చు. అయితే ముందుగా ఈ పాత్ర కోసం కొంతమంది నటులు అనుకున్నారట కానీ కొన్ని కారణాల చేత వారిని తీసుకోలేదని సమాచారం. ఇప్పుడు వారెవరు తెలుసుకుందాం.
తెలుగు ప్రేక్షకుల అభిరుచి కి తగ్గట్టుగా మోహన్ రాజా ఈ చిత్రంలో పలుమార్పులు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలోని సత్యదేవ పాత్రకు కూడా పలు మార్పులు చేశారట. సత్యదేవ పాత్రకు కాస్త విలనిజాన్ని జోడించి హైలైట్ గా చేశారు.
అయితే ముందుగా ఈ పాత్ర కోసం తమిళ నటుడు అరవింద్ స్వామిని తీసుకోవాలనుకున్నారట. అయితే తను ఇతర సినిమాలలో బిజీగా ఉండడం చేత నో చెప్పారట. ఇక తర్వాత టాలీవుడ్లో హీరో గోపీచంద్ సంప్రదించారని వార్తలు వినిపించాయి. అయితే హీరోగా చేస్తున్న సమయంలో విలన్ గా నటించడం ఇష్టం లేకనే ఈ చిత్రాన్ని ఒప్పుకోలేదని సమాచారం. మీరే కాకుండా మరికొంతమంది హీరోలను కూడా అడగగా వారి ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో చివరికి సత్యదేవ్ ని తీసుకోవడం జరిగిందట.