తెలుగులో డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన గులాబీ చిత్రం ద్వారా మహేశ్వరి తన నటనతో కు కుర్రకారులను సైతం బాగా ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రంలో జెడి చక్రవర్తి హీరోగా నటించారు. ఇక ఈ చిత్రం సమయంలోనే మహేశ్వరి ప్రేమ కోసం జెడి చక్రవర్తి డైరెక్టర్ కృష్ణవంశీ మధ్య గొడవలు వచ్చాయని వార్త అప్పట్లో బాగా వైరల్ గా మారాయి. ఇక తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లోనే దెయ్యం సినిమాతో మరింత దగ్గరయ్యారని సమాచారం.అయితే ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ.. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించిన మహేశ్వరి స్టార్ హీరోయిన్ మాత్రం కాలేకపోయిందని చెప్పవచ్చు.
శ్రీదేవి అక్క కూతురుగా మంచి పాపులారిటీ సంపాదించుకుంది మహేశ్వరి. ఇక అంతే కాకుండా శ్రీదేవి సపోర్ట్ తోనే మహేశ్వరి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిందని చెప్పవచ్చు. శ్రీదేవి తల్లి రాజేశ్వరమ్మకు మొదటి భర్త రంగారావు ద్వారా పుట్టిన సూర్య కళ కుమార్తె మహేశ్వరి. ముఖ్యంగా శ్రీదేవి కుటుంబం చెప్పుకొని మహేశ్వరి కుటుంబం చాలానే లాభపడిందని చెప్పవచ్చు అయితే శ్రీదేవి చనిపోయినప్పుడు మహేశ్వరి కానీ ఆ కుటుంబ సభ్యులు కానీ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం అందరిని ఆశ్చర్యపరిచేలా చేసింది.
అయితే అందుకు గల కారణాలు ఏంటి అనే విషయం మాత్రం తెలియలేదు కానీ.. ఇక తర్వాత మహేశ్వరి ఎక్కడ కనిపించలేదు సినీ పరిశ్రమలో అప్పట్లో వినిపించిన వార్తల ప్రకారం శ్రీదేవి మహేశ్వరి కుటుంబానికి పెద్దగా మాట్లాడుకోలేదని వార్తలు అయితే వినిపించాయి. ఇక మహేశ్వరి విషయానికి వస్తే అలా గులాబీ సినిమా షూటింగ్ సమయంలో జెడి చక్రవర్తి ఈమెతో లవ్లో ఉండడం తో షూటింగ్ చేస్తున్న సమయంలో కాస్త లేటుగా వచ్చిందని మహేశ్వరుని తిడుతూ ఉండగా జెడి చక్రవర్తి వచ్చి తన వల్లే తాను లేటుగా వచ్చిందని చెప్పారట. దీంతో అప్పటినుంచి కృష్ణవంశీ జెడి చక్రవర్తి మధ్య విభేదాలు ఉన్నట్లుగా సమాచారం.