పూర్వపు రోజుల్లో మహిళలు ఎక్కువగా బయటకు రావాలి అంటే చాలా ఇబ్బంది పడేవారు. అంతేకాకుండా మద్యం వంటివి తాగడం చాలా పెద్ద తప్పుగా భావించేవారు. కానీ మహిళలు కూడా బార్లు, పబ్బులు వంటి వాటితో పురుషులతో సమానంగా ఈ కాలంలో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా కొన్ని పబ్స్ ప్రత్యేకంగా మహిళల కోసమే ఉన్నాయని చెప్పవచ్చు. అందుచేతనే ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఉండే నటీమణులు కూడా పబ్బుల్లో చాలా ఎంజాయ్ చేస్తూ అభిమానులకు దొరికిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాంటి నటీమణులు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
విశ్వ నటుడు కమలహాసన్ కూతురు శృతిహాసన్ షూటింగ్ లు లేకపోతే బెంగళూరులో పలు పబ్బులకు వెళ్లి బాగా ఎంజాయ్ చేస్తూ మద్యం సేవిస్తుందని టాక్ కోలీవుడ్ ఇండస్ట్రీలో బాగా వినిపిస్తోంది. అలా ఒకవేళ హ్యాంగ్ ఓవర్ అయితే షూటింగ్ ఆరోజు లేటుగా వస్తుందని సమాచారం.
ఇక అలనాటి హీరోయిన్ ఊర్వశి కూడా మద్యం తాగుతుందట. అంతేకాకుండా పబ్లిక్ ఫంక్షన్లకు సైతం హాజరవుతూ ఉంటుందని వినిపిస్తోంది. ఇక కొన్ని సందర్భాలలో ఈమె మందు తాగి పోలీసులకు దొరికిన సందర్భాలు ఉన్నట్లు సమాచారం. అందుకు సంబంధించి పలు వీడియోలు కూడా యూట్యూబ్లో కనిపిస్తూ ఉంటాయని తెలుస్తుంది.
ఇక అలనాటి హీరోయిన్ త్రిష కూడా ఫుల్లుగా మద్యం తాగి పోలీసులకు దొరికిందని అప్పట్లో బాగా వార్తలు వినిపించాయి. అది కూడా ఒక స్టార్ హీరోలతో కలిసి గోవాలో దొరికిందని సమాచారం.
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ హన్సిక దేశముదురు సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ చిత్రంలో పలు సన్నివేశాలలో నిజంగానే తాగి వచ్చి పలు సన్నివేశాలను నటించిందని అప్పట్లో టాక్ బాగా వినిపించాయి.
మరి ఈ విషయాలను ఎంతటి నిజం ఉందో తెలియాల్సి ఉన్నది.