తెలుగు సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ శంకర్ కు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈయన తెరకెక్కించే సినిమాలు ఎక్కువగా మెసేజ్ కంటెంట్ తో ఉంటాయని చెప్పవచ్చు. అందుచేతనే శంకర్ సినిమాలు ఎక్కువగా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంటూ ఉంటాయి. ఇక తాజాగా చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ rc-15 సినిమా కమలహాసన్ తో భారతీయుడు -2 సినిమాలను తెరకెక్కిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా తెలుగు ఇండస్ట్రీలో ఒక న్యూస్ హాట్ టాపిక్ గా మారుతోంది. చిరంజీవి స్టార్ డైరెక్టర్ శంకరును పిలిచి వార్నింగ్ ఇచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఈ మధ్యకాలంలో దర్శకులు ఎక్కువగా ఒక ప్రాజెక్టు లైన్ లో ఉండగానే మరొక ప్రాజెక్టును మొదలు పెట్టేస్తూ ఉన్నారు. అలాంటి సమయంలోనే సినిమాల పైన నిర్లక్ష్యం వహిస్తూ ఉంటారు. అలా మొదట భారతీయుడు -2 సినిమాని మొదలు పెట్టక షూటింగ్ మొదట్లోనే ఈ సినిమా ఆగిపోయింది. దాంతో ఆయనకు తెలుగులో వచ్చిన బంపర్ ఆఫర్ ను కూడా వినియోగించుకోవడం జరిగింది. అలా రామ్ చరణ్ తో కలిసి పాన్ ఇండియా మూవీని మొదలుపెట్టారు ఇక ఈ సినిమా 60% షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నది. ఈలోపు పలు వివాదాలతో ఆగిపోయిన భారతీయుడు -2 సినిమా షూటింగ్ కి మళ్ళీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది.
శంకర్ మళ్లీ భారతీయుడు-2 సినిమా వైపుగా తన మకాన్ని మార్చాడు. రామ్ చరణ్ సినిమా రెండు నెలల్లో పూర్తి అయిపోతుందనుకున్న సమయంలో డైరెక్టర్ శంకర్ తన డ్రీమ్ ప్రాజెక్టు భారతీయుడు-2 సినిమా కోసం రామ్ చరణ్ సినిమాని కాస్త నెగ్లెట్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి దీంతో మెగా అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అలా రామ్ చరణ్ సినిమాలు మధ్యలో వదిలేయడమే కాకుండా సినిమా సెట్స్ కి శంకర్ రాకుండా వేరే అసిస్టెంట్ డైరెక్టర్ ని పెట్టి మేనేజ్ చేస్తున్నారట. ఈ విషయం తెలిసిన రామ్ చరణ్ కి కోపం వచ్చి శంకరును రెండుసార్లు నిలదీశారు. అయినా కూడా పట్టించుకోకుండా విషయం చిరంజీవి వరకు వెళ్లినట్లుగా సమాచారం దీంతో చిరంజీవి పర్సనల్గా కాల్ చేసి శంకర్కు వార్నింగ్ ఇచ్చినట్లుగా సమాచారం మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉన్నది.