కృష్ణంరాజు కుటుంబాన్ని కి అండగా బాలకృష్ణ… ఫోటోలు వైరల్..!

గత నెల తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవ్వరు ఊహించని విషాదాలు చోటు చేసుకున్నాయి. ఆ నెలలోనే టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు అనారోగ్య సమస్యలతో సెప్టెంబర్ 11న మరణించిన విషయం మనకు తెలిసిందే. ఆయన మరణ వార్తతో తెలుగు చిత్ర పరిశ్రమ ఒక పెద్ద దిక్కును కోల్పోయింది. అయ‌న పార్థివ దేహం వద్దకు చిత్ర పరిశ్రమలో అగ్ర‌ హీరోలు- నిర్మాతలు అందరూ కదిలి వచ్చారు. ఈ క్రమంలోనే కృష్ణంరాజు గారు మరణించిన సమయంలో బాలకృష్ణ ఇండియాలో లేరు.

తన 107వ సినిమా షూటింగ్ నిమిత్తం టర్కీ లో ఉన్నాడు. అక్కడ ఉన్న బాలకృష్ణకు ఈ వార్త తెలియడంతో అక్కడే కృష్ణంరాజు గారికి తన సంతాపాన్ని ప్రకటించాడు. తన సినిమా షూటింగ్ ముగించుకుని ఇండియా వచ్చిన బాలకృష్ణ గత రాత్రి తన భార్యతో కలిసి కృష్ణంరాజు కుటుంబ సభ్యులను పరామర్శించాడు. కృష్ణంరాజు ఇంటికి వెళ్లిన బాలకృష్ణ ఆయన ఫోటోకి నివాళులుర్పించాడు. తర్వాత కృష్ణంరాజు భార్య శ్యామలాదేవితో చాలాసేపు మాట్లాడి ఓదార్చి ఆమెను పరామర్శించారు.

ఈ క్రమంలోని బాలకృష్ణ మాట్లాడుతూ “నేను నా తండ్రి ని కృష్ణంరాజు గారిని చూస్తూనే పెరుగను. నాకు ఆయనతో చాలా మంచి అనుబంధం ఉంది. నేను కృష్ణంరాజు గారితో సుల్తాన్- వంశోద్ధారకుడు సినిమాల్లో కలిసి నటించాను. ఆయనతో కలిసి గడిపిన క్షణాలను ఇప్పటికీ మర్చిపోలేక పోతున్నాను. ఆయన లేని లోటు ఇండస్ట్రీకి ఎవరు తీర్చలేరు”.. అంటూ బాలకృష్ణ ఆయనతో ఉన్న తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.